
కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చందుపట్ల కీర్తి సత్యపాల్ రెడ్డి
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాశీంపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ మాజీ యూత్ అధ్యక్షులు లారీ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు తెలంగాణ ఉద్యమకారుడు మారెళ్ళ సేనాపతి భారతీయ జనతా పార్టీ భూపాలపల్లి అర్బన్ అధ్యక్షులు సామల మధుసూదన్ రెడ్డి అర్బన్ ప్రధాన కార్యదర్శి తుమ్మేటి రాంరెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు వారితోపాటు సుమారు 50 మంది బిజెపి పార్టీలో చేరిక కండువా కప్పి ఆహ్వానించిన బిజెపి పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ చందుపట్ల కీర్తి సత్యపాల్ రెడ్డి అనంతరం మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలు నమ్మి పార్టీలోకి వచ్చిన మీకు ఎల్లవేళలా మేము అండగా ఉంటామని కీర్తి సత్యపాల్ రెడ్డి హామీ ఇచ్చారు అనంతరం సేనాపతి మాట్లాడుతూ గతంలో ఎన్నో సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పనిచేస్తూ పార్టీ ఎదుగుదలకు ఎంతో కష్టపడ్డానని వారన్నారు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు చూసి అన్ని వర్గాల ప్రజలకు అందిచ్చేటువంటి ప్రతి ఒక్క పేద మధ్యతరగతి వాళ్లకు కూడా చేయూతనిచ్చే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని చూసి భారతీయ జనతా పార్టీలో చేరానని నా ఊరు బాగు కోసం పార్టీ ఎదుగుదలకు నా వంతు కృషి చేస్తానని సేనాపతి అన్నారు నాతో పాటు ఉన్న నా మిత్రులందరికీ నా సహాయ సహకారాలు అందిస్తానని ఈరోజు నన్ను భారతీయ జనతా పార్టీ లోకి ఆహ్వానించి నాపై నమ్మకాన్ని ఉంచిన రాష్ట్ర జిల్లా.అర్బన్ నాయకులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిశీధర్ రెడ్డి ఓ బి సి జిల్లా అధ్యక్షులు దొంగల రాజేందర్ జిల్లా ప్రచార కార్యదర్శి మందల రఘునాథరెడ్డి అర్బన్ ఉపాధ్యక్షులు మనోహర్ రెడ్డి తోట ఓదెలు ఊరేటి మునిందర్ నాంపల్లి కుమార్ బోరం రాజయ్య తదితరులు బిజెపి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు