ఘనంగా మచ్చలేని మహనీయులు పుస్తకావిష్కరణ.

Book launch Book launch

ఘనంగా మచ్చలేని మహనీయులు పుస్తకావిష్కరణ

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)

 

 

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈ రోజున ఉదయం చేనేత వస్త్ర వ్యాపార సంఘంలో డాక్టర్ జనపాల శంకరయ్య అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్ కార్యనిర్వహణలో డాక్టర్ జనపాల శంకరయ్య విరచితమైన (మచ్చలేని మహనీయులు పుస్తక ఆవిష్కరణ )ఘనంగా జరిగినది ఈ సందర్భంగా ఆకునూరి పూర్వ గ్రంథాలయ అధ్యక్షులు ఆకునూరి శంకరయ్య మాట్లాడుతూ పిల్లల కోసం మహనీయుల చరిత్రలు రాయడం శుభదాయకం అన్నారు ముఖ్యఅతిథి మాట్లాడుతూ పిల్లలు కేవలం సెల్లుకు బానిసలు అవుతున్న నేపథ్యంలో పిల్లల భవిష్యత్తు కోసం మార్గదర్శకంగా చిన్న చిన్న పదాలతో రాయడం సృజనాత్మకవుకు నిదర్శనం అన్నారు అంతేకాకుండా చందమామ కోరస్ లో చక్కని కథా గేయంగా మలచడం భవిష్యత్తులో మంచి పేరు ఉంటుందని ఆశించారు.

 

Book launch
Book launch

 

 

 

పేర్కొన్నారు.ముఖ్య అతిథిగా ఆకునూరి శంకరయ్య ,జిందం చక్రపాణి, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ఆడెపు రవీందర్, సీనియర్ సిటిజన్ అధ్యక్షులు చేపూరు బుచ్చయ్య ,గీతా ప్రచార సమితి అధ్యక్షులు కోడం నారాయణ, వ్యాపార సంఘం అధ్యక్షులు పాములకు పత్తి దామోదర్ , కార్యదర్శి గౌడ రాజు ,ఉపాధ్యక్షులు ఏనుగుల ఎల్లయ్య, జిల్లా కవులు, రచయితలు బూర దేవానందం, అంకారపు రవి, మల్లేష్ చక్రాల,సీనియర్ సిటిజన్ అధ్యక్షులు చేపూరి బుచ్చయ్య, కోశాధికారి దొంత దేవదాసు బంధు వర్గం ఎందరో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి 50 సంవత్సరాల పెళ్లి వేడుక కూడా ఘనంగా జరిగినది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!