Blood Donation Camp Today at Zaheerabad
నేడు రక్తదాన శిబిరం
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్, జనవరి 11: స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఈ నెల 12న స్థానిక పద్మశాలి భవన్ లో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు పద్మశాలి యువజన సంఘం ఒక ప్రకటనలో పేర్కొంది. సోమవారం ఉదయం 8.30 నుండి 1.00 వరకు రక్తదాన శిబిరం కొనసాగుతుందని, 60 సంవత్సరాలలోపు యువతీ యువకులు ఎవరైనా ఈ శిబిరంలో పాల్గొని రక్తాన్ని దానం చేయవచ్చని పేర్కొన్నారు. రక్తం దానం చేయడం ద్వారా మరొకరికి ప్రాణదాతగా నిలుస్తారని శిబిరంలో రక్తదానం చేసినవారికి ధ్రువపత్రం కూడా జారీ చేయబడుతుందని వివరించింది. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువతీ యువకులు రావాలని పిలుపునిచ్చింది.
