కోలాహాలంగా బీజేపీ శ్రేణుల విజయోత్సవ వేడుకలు
శాయంపేట నేటిధాత్రి
శాయంపేట మండల కేంద్రంలో కూడలి వద్ద బీజేపీ మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో విజయోత్సవ వేడుకలు జరిగాయి. టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భం గా బిజెపి మండల అధ్యక్షుడు మాట్లాడుతూ రాహుల్ గాంధీ అరవింద్ క్రేజీ వాల్ హామీలు ప్రజలు నమ్మలేదని ఆఫ్ మరియు కాంగ్రెస్ ఎంత వ్యతిరేకత ఉందో తాజా ఫలితాలను బట్టి అర్థమవు తుంది. గత పార్లమెంటు ఎన్నికల్లోను ఢిల్లీ ప్రజలు బిజెపికి పూర్తి మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు భారతీయ జనతాపార్టీ ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో డబుల్ ఇంజన్ సర్కారు వలన ఢిల్లీ అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ దేశాన్ని నాశనం చేస్తే కేజ్రీవాల్ ఢిల్లీని భ్రష్టుపట్టించా రు. వాయు,రాజకీయ కాలుష్యంతో కలుషితం జరిగిందన్నారు.ఈ గెలుపు ఢిల్లీ అభివృద్ధికీ మలుపని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్ మెంబర్ రాయ రాకులమొగిలి,మండల బిజెపి నాయకులు, మండలమంతా బిజెపి నాయకులు అధిక మొత్తంలో పాల్గొన్నారు.