
BJP Leaders Repair Roads in Ganapuram
రోడ్డు మరమ్మత్తులు చేపట్టిన బిజెపి నాయకులు
బీజేపీ మండల అధ్యక్షుడు ఊర నవీన్ రావు
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల లో ఊర నవీన్ రావు అధ్యక్షుడి ఆధ్వర్యంలో రోడ్డు పైనా గుంతలు పుడ్చడం కార్యక్రమం
బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షం కు ఓసి-3బాధిత గ్రామాలు నగరంపల్లి గ్రామం లోని ముసళ్ల కుంట గండి పడి నగరంపల్లి అప్పయ్యపల్లి గ్రామాల మధ్య రాకపోకలకు ఇబ్బంది కలిగి సీతారాంపూర్, బంగ్లాపల్లి, అప్పయ్య పల్లి నుండీ మండల కేంద్రం లోని పాఠశాలల కు వెళ్లే విద్యార్థులు మరియు వ్యవసాయా పనులకు వెళ్లే రైతులు ఇబ్బందులకు గురి అవుతున్న కారణం గా బీజేపీ కార్యకర్తలు స్వచ్చ భారత్ కార్యక్రమం లో భాగంగా రోడ్డు పై ఏర్పడ్డ గుంతలను పుడ్చారు అనంతరం నవీన్ రావు మాట్లాడుతు సింగరేణి యాజమాన్యం యుద్ధ ప్రతిపదికన రోడ్డు మరమ్మత్తు చర్యలు చేపట్టి ఆయా గ్రామాల మధ్య రాకపోకలు ఇబ్బంది లేకుండా చూడాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమం లో బూత్ అధ్యక్షులు భూక్యా హరిలాల్, ఇనుగాలా మొగిలి నాయకులుమామిడిపల్లి మల్లన్న, మైదాం శంకర్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు