Traffic Diversion for 9 Months in Secunderabad
ఆ ఏరియా వాసులకు బిగ్ అలెర్ట్.. నేటి నుంచి 9 నెలలపాటు ట్రాఫిక్ మళ్లింపు
ప్యారడైజ్ జంక్షన్ నుంచి డెయిరీఫామ్ రోడ్ వరకు జాతీయ రహదారి 44 పై ఎలివేటెడ్ కారిడర్ నిర్మాణం పనులు ప్రారంభం సందర్భంగా ట్రాఫిక్ను మళ్లిస్తున్నామని జాయింట్ కమిషనర్ డి. జోయల్ డేవిస్ తెలిపారు. ఈనెల 30 నుంచి 9 నెలలపాటు ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉంటాయన్నారు.
బాలనగర్ వైపు నుంచి పంజాగుట్ట ట్యాంక్ బండ్ వైపు వెళ్లేవారు తాడ్బంద్ మస్తాన్ కేఫ్, డైమండ్ పాయింట్ కుడివైపు మలుపు తిరిగి మడ్ఫోర్ట్, ఎన్సీసీ, జేబీఎస్, ఎస్బీఐ మార్గంలో వెళ్లాలని పేర్కొన్నారు. సుచిత్ర వైపు నుంచి పంజాగుట్ట, ట్యాంక్బండ్ వైపు వెళ్లే వారు సేఫ్ ఎక్స్ప్రెస్ ఎడమవైపు మలుపు తిరిగి బాపూజీనగర్, సెంటర్ పాయింట్, డైమండ్ పాయింట్, మడ్ఫోర్ట్, ఎన్సీసీ, జేబీఎస్, ఎస్బీఐ మార్గంలో వెళ్లాలని పేర్కొన్నారు. ట్యాంక్బండ్ రాణిగంజ్, పంజాగుట్ట, రసూల్పురా,
