భువన్ రిభుకు వరల్డ్ జ్యూరిస్ట్ అసోసియేషన్ మెడల్ ఆఫ్ హానర్ అవార్డు.
రామాయంపేట నేటి ధాత్రి:
ప్రపంచ న్యాయ అవార్డు అందుకున్న తొలి భారతీయుడు భువన్ రిభు.
వరల్డ్ లా కాంగ్రెస్ లో వరల్డ్ జ్యూరిస్ట్ అసోసియేషన్ మెడల్ ఆఫ్ హానర్ అవార్డును మన భారత సుప్రీంకోర్టు న్యాయవాది భువన్ రిభు అందుకోవటము మన దేశానికి ఒక గొప్ప ప్రతిభ గా చెప్పుకోవాలి, ఈ విజయం 262 జాతీయ స్వచ్ఛంద సంస్థలు తరపున, బాలల హక్కుల కన్వీనర్ భువన్ రిభు అందుకున్నారు.

భువన్ రిభు దేశంలోని బాలల హక్కుల కోసం 416 జిల్లాల్లో పనిచేస్తున్న 262 ఎన్జీవోలను
ఒకే గొడుగు కింద తీసుకువచ్చి, జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్ ను ఏర్పాటు చేయడం గొప్ప విషయమని అన్నారు. ఈ సందర్భంగా భువన్ రీభుకు బుధవారం విజన్ సంస్థ డైరెక్టర్ వంగరీ కైలాస్, జిల్లా కోఆర్డినేటర్ రాజు, సిబ్బంది ప్రత్యేక శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలిపారు.