కాటారం నేటి ధాత్రి:
చత్రపతి శివాజీ విగ్రహ నిర్మాణానికి భూమి పూజ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మండల కేంద్రమైన కాటారం గారెపల్లిలో జాతీయ రహదారిపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదురుగా గల చౌరస్తాలో సోమవారం సర్పంచ్ తోట రాదమ్మ, ఉప సర్పంచ్ నాయిని శ్రీనివాస్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు తోట కోటేశ్వర్ భూమి పూజ నిర్వహించారు. చత్రపతి శివాజీ ఆదర్శ పరిపాలన కొనసాగించాలని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మనం రాజబాబు గోనె రవి మాచర్ల రాజేందర్, పసుల శంకర్, చీమల రాజు, గౌరోజు రోశయ్య, గోనె మహేష్, పసుల రమేష్ సతీష్, సాంబరాతి తిరుపతి, రాము, తోట రాజేష్ ఆడవాల అంజి తోట శేఖర్ తోటరాజు గోనె వెంకట్ స్వామి ముక్తి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.