భూ సమస్యల పరిష్కారానికి “భూ భారతి…
నూతన ఆర్ఓఆర్ చట్టం – 2025″, గొప్ప వేదిక
సామాన్య ప్రజలకు అందుబాటులో భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టం
జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్
రెవెన్యూ సదస్సు వేదికగా పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి నివాళి
చారిత్రాత్మకమైన గొప్ప చట్టం భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టం
క్షేత్రస్థాయిలోనే భూ సమస్యలు పరిష్కారం
నారాయణపురం, బెరువాడ గ్రామాల భూ సమస్యలకు పరిష్కారం కోసం కృషి చేస్తాం
మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్
కేసముద్రం/ నేటి ధాత్రి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి – చట్టం 25, అవగాహన సదస్సు శుక్రవారం మహబూబాబాద్ , కేసముద్రం మండలల రైతు వేదికలలో , జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్, మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళీ నాయక్, అదనపు కలెక్టర్లు (రెవెన్యూ) కె.వీరబ్రహ్మంచారి, రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణవేణి, తదితరులు హాజరై తెలంగాణ గీతం ఆలపించి, పిపిటి, చదివి రైతులకు భూభారతి కొత్త ఆర్ఓఆర్ చట్టం అంశాలపై అవహన కల్పించారు,
ఈ సందర్భంగా మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్, మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా చారిత్రాత్మకమైన నూతన భూభారతి చట్టం అని, సామాన్య ప్రజలకు క్షేత్రస్థాయిలోనే భూ సమస్యల పరిష్కారం, నూతన ఆర్ఓఆర్ చట్టం ద్వారా
పిఓటి, ఎల్.టి.ఆర్, సీలింగ్ దరఖాస్తులను క్రమబద్ధీకరణ చేసే నాటి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, 100 రూపాయల అపరాధ రుసుం వసూలు చేసి సర్టిఫికెట్ జారీ చేస్తారని, హక్కుల రికార్డులు వివరాలను నమోదు చేసి పాసు బుక్ జారీ చేస్తారని,
రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతి గ్రామంలో గ్రామ పరిపాలన అధికారులను నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మనిషికి ఆధార్ కార్డు లాగా భూమికి భూదార్ సంఖ్య కేటాయింపు ప్రణాళిక చేస్తుందని, దీని ద్వారా భూ ఆక్రమణలకు చెక్ పెట్టవచ్చని స్పష్టం చేశారు.

భూ సమస్యలపై అధికారులు అందించిన ఆర్డర్ల పై భూ భారతి చట్టం ప్రకారం ఆప్పీల్ చేసుకునే అవకాశం ఉందని, రెవెన్యూ డివిజన్ అధికారి నిర్ణయం పై కలెక్టర్ వద్ద, కలెక్టర్ నిర్ణయం పై భూమి ట్రిబ్యునల్ వద్ద అపీల్ చేసుకోవచ్చని, గతంలో ధరణి వ్యవస్థ ఉన్నప్పుడు ఏదైనా అభ్యంతరాలు ఉంటే సివిల్ కోర్టుకు మాత్రమే వెళ్లాల్సి ఉండేదని గుర్తు చేశారు.
అప్పీల్ వ్యవస్థ అందించిన తీర్పు తర్వాత కూడా సంతృప్తి చెందకపోతే సివిల్ కోర్టు వెళ్ళవచ్చని, దరఖాస్తుదారులకు అవసరమైన ఉచిత న్యాయ సలహాను ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ రికార్డుల తయారు చేసి, ప్రతి సంవత్సరం గ్రామాలలో రికార్డు డిస్ ప్లే చేయడం జరుగుతుందని అన్నారు.
గ్రామాలలో సర్వే చేసి, హద్దులు, నక్ష సిద్ధం జరుగుతుందన్నారు,
నారాయణపురం, పెరువాడ గ్రామాల భూ సమస్యల పరిష్కారం కోసం నూతన చట్టం ఎంతో ఉపయోగపడుతుందని, అవసరమైతే ముఖ్యమంత్రి తో స్వయంగా మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని చెప్పారు,
గత ధరణి వ్యవస్థ నిర్లక్ష్యం వలన అనేక మంది రైతులు ఇబ్బందుల పాలు అయ్యారని, ప్రస్తుత చట్టం ద్వారా క్షేత్రస్థాయిలోనే భూ సమస్యను పరిశీలించి పరిష్కరించడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారని మే జూన్ నెలలో పూర్తిస్థాయిలో భూభారతి చట్టం అమలులోకి రానుందని తెలిపారు,
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి రోజే ఈ చట్టాన్ని ప్రవేశపెట్టారని గుర్తుకు చేశారు, తన వద్దకు వచ్చే సమస్యలు 80% భూ సమస్యలు మాత్రమే ఉండేవని తెలిపారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వం మంత్రివర్గం తీసుకున్న గొప్ప చారిత్రాత్మకమైన నూతన భూభారతి చట్టం అని అన్ని సమస్యల పరిష్కారానికి వేదిక అవుతుందని అన్నారు,
జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
మాట్లాడుతూ
భూ భారతి నూతన ఆర్ఓఆర్ చట్టం ప్రకారం దరఖాస్తు చేసుకున్న వారికి న్యాయమైన సేవలు, అందుతాయని,
ఈ చట్టం ముఖ్యంగా విప్లవంతత్వం మైంది.
గత ధరణిలో రెవిన్యూ అధికారులకు ఎలాంటి అధికారాలు లేవని అన్నారు,
ప్రస్తుతం చట్టంలో అనేక సౌకర్యాలు కల్పించడం జరిగిందని, తద్వారా రైతులకు సులభతరమైన న్యాయమైన విస్తృత స్థాయిలో సహాయం అందుతుందన్నారు,
క్షేత్రస్థాయిలో భూ సమస్యలు పరిష్కారం కోసం ప్రభుత్వం వెసులుబాటుకల్పించింది.
గ్రామ, మండల, డివిజనల్ స్థాయి, జిల్లాస్థాయి లలో దరఖాస్తులను పరిశీలించి ఎవరి పరిధిలో ఉంటే వారే పరిష్కరించడానికి కోసం నూతన చట్టం ఎంతో ఉపయోగపడుతుందని అందుకు ప్రభుత్వం గ్రామ పాలన అధికారి, సర్వేయర్లను నియమించుకోవడం జరుగుతుందని అన్నారు,
ఎవరికి కేటాయించిన సమయాలలో వారు పక్కాగా సమస్య పరిష్కరించాలన్నారు,
విప్లవాత్మకమైన ఈ పథకం ద్వారా సామాన్య రైతు ప్రతి ఒక్కరు న్యాయమైన ఉచిత సేవలను త్వరితగతిన పొందుతారని సూచించారు,
రానున్న రోజుల్లో ప్రభుత్వ సూచనల మేరకు గ్రామసభలు నిర్వహించి ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్లడం జరుగుతుందని అన్నారు,
అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె.వీరబ్రహ్మచారి, మాట్లాడుతూ నూతన చట్టంపై రైతులకు సవివరంగా తెలియజేశారు,
మార్కెట్ కమిటీ చైర్మన్ గంటా సంజీవరెడ్డి, రైతులు వెంకన్న, యాకూబ్ రెడ్డి, తదితరులు భూ సమస్యల పరిష్కారం కోసం అడిగిన ప్రశ్నలకు కలెక్టర్ ఎమ్మెల్యే అదనపు కలెక్టర్ సమాధానం ఇచ్చారు,
ఈ రెవెన్యూ సదస్సులో
జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని విజయనిర్మల, ఏడి సర్వే ల్యాండ్ ఏ.నరసింహమూర్తి, స్థానిక తహసిల్దార్ రాగం ఎర్రయ్య, ఎంపిడిఓ క్రాంతి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి,వ్యవసాయ శాఖ ఏడిఏ శ్రీనివాస్, ఏ ఓ వెంకన్న, పిఎసిఎస్ వైస్ ప్రెసిడెంట్ అంబటి మహేందర్ రెడ్డి, ధనసరి పిఎసిఎస్ వైస్ ప్రెసిడెంట్ అల్లం నాగేశ్వరరావు, మాజీ పిఎసిఎస్ చైర్మన్ బండారి వెంకన్న, సంబంధిత అధికారులు, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.