విద్యుత్ డీఈ సదానందంకు ఘన వీడ్కోలు.

విద్యుత్ డీఈ సదానందంకు ఘన వీడ్కోలు.

నర్సంపేట,నేటిధాత్రి :

గత సంవత్సరంనర కాలంగా నర్సంపేట డివిజన్ పరిధిలో విద్యుత్ ఆపరేషన్ డివిజనల్ ఇంజనీర్ అధికారిగా గా సేవలు అందించిన నాగెల్లి సదానందం భూపాలపల్లి ఎంఆర్టి అండ్ కన్‌స్ట్రక్షన్ డీఈగా బదిలీ అయ్యారు.ఈ నేపథ్యంలో ఆయనకు నర్సంపేట డివిజన్ పరిధి అధ్వర్యంలో వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయా మండలాల విద్యుత్ అధికారులు డీఈ సదానందంకు పుష్పగుచ్చాలు, మెమొంటాలు అందించి శాలువాలతో ఘనంగా సన్మానించారు.డీఈ సదానందం చేసిన సేవలను పలువురు గుర్తుకు చేశారు.అనంతరం జ్ఞాపికలు అందించి ఘనంగా వీడ్కోలు పలికారు.ఈ సందర్భంగా డీఈ సదానందం మాట్లాడుతూ ప్రజలకు,రైతులకు మెరుగైన విద్యుత్ అందించేందుకు తన వంతుగా కృషి,బాధ్యతలు చేశానని పేర్కొన్నారు.ఈ వీడ్కోలు కార్యక్రమంలో ఏడిఈలు ఏడిఈలు అమ్రునాయక్,లక్ష్మణ్,ఐలయ్య,
టెక్నికల్ ఏఈ పోషాల రాజు,కమర్షియల్ ఏఈ బండారి రామకృష్ణ, నల్లబెల్లి,నర్సంపేట రూరల్,నర్సంపేటటౌన్,దుగ్గొండి,చెన్నారావుపేట, నెక్కొండ మండలాల ఆపరేషన్ ఏఈలు పెద్ది రవళి,సంపత్ కుమార్, శ్రీదర్, రామ్మూర్తి,జోగానంద్, చిరంజీవి,కాంట్రాక్టర్ సుంకరి సంతోష్ రెడ్డి, ఆయా మండలాల సిబ్బంది పాల్గొన్నారు.


# గిర్నిబావి ఏఈ సురేష్ కుమార్ బదిలీ..
# ఇంఛార్జిగా బండారి రామకృష్ణ..

దుగ్గొండి మండలంలోని గిర్నిబావి సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ ఆపరేషన్ ఏఈగా విధులు నిర్వహిస్తున్న సురేష్ కుమార్ కరీంనగర్ కు బదిలీ అయ్యాడు.కాగా ఆయనకు డివిజన్ పరిధిలోని విద్యుత్ అధికారులు సన్మానించి వీడ్కోలు పలికారు.

# బదిలీపై వెళ్లిన సురేష్ కుమార్ స్థానంలో నర్సంపేట డివిజన్ పరిధిలో
కమర్షియల్ ఏఈగా విధులు నిర్వహిస్తున్న బండారి రామకృష్ణకు ఇంఛార్జి బాధ్యతలను సంబంధిత ఉన్నత అధికారులు అప్పగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *