ఇంటర్ విద్యార్థులకు బెస్ట్ ఆఫ్ లక్

ప్రశాంతంగా పరీక్షలు వ్రాయండి.

మీ లక్ష్యం తప్పక దరికి
చేరుస్తుంది

జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

జనగామ, నేటిధాత్రి:-
నేడు పరీక్షలు రాస్తున్న ఇంటర్ విద్యార్థులు ఎటువంటి ఆలోచనలను మనసులోకి రానివ్వకుండా, ఓత్తిడిలకు గురి కాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు వ్రాయాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. మంగళవారం ఓ ప్రకటనలో బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు. ఈ సందర్బంగా మీరు ఇన్నాళ్లు పడిన కష్టానికి తగిన విజయం మీకు అందాలని కోరుకుంటున్నాను. మీ భవిష్యత్ కు కీలకమైన మలుపు ఇది. పరీక్ష హల్ కు సకాలంలో చేరుకోండి. ప్రశాంతంగా పరీక్షలు వ్రాయండి. మీ లక్ష్యం దరికి తప్పక చేరుస్తుందని ఎమ్మెల్యే పల్లా తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!