శంకర్ కు ఉత్తమ అవార్డు
బాలానగర్ /నేటి ధాత్రి.
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల ఎంఈఓ శంకర్ కు మల్టీ జోనల్-2లో ఉత్తమ పర్యవేక్షణ విద్య అధికారిగా ఎంపికయ్యారు. హైదరాబాదులో ఎస్సిఆర్టి డైరెక్టర్ రమేశ్, ఆర్జేడి విజయలక్ష్మి చేతుల మీదుగా గురువారం అవార్డు అందుకున్నారు. విధినిర్వహణలో అంకితభావంతో పనిచేస్తున్న శంకర్ రాష్ట్రస్థాయిలో ఉత్తమ అవార్డు రావడంతో ఉపాధ్యాయులు, పలువురు నేతలు అభినందనలు తెలిపారు.