
Naini Anusha Ashok.
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
డా వన్నాల వెంకటరమణ
#నెక్కొండ, నేటి ధాత్రి:
నెక్కొండ మండల కేంద్రంలో బిజెపి ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని మండల బిజెపి పార్టీ అధ్యక్షుడు నాయిని అనూష అశోక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వెంకటరమణ హాజరయ్యారు.స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా వాటికి సిద్ధంగా ఉండాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు, కార్యకర్తలకు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ వన్నాల వెంకటరమణ పిలుపునిచ్చారు.
ఈ సమావేశానికి మండల ఎన్నికల ప్రభారి కుడికాల శ్రీధర్ హాజరైనారు.ఈ సందర్భంగా డాక్టర్ వన్నాల వెంకటరమణ మాట్లాడుతూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బూత్ స్థాయి నుండి మండల అధ్యక్షుల వరకు ప్రతి ఒక్కరూ కష్టపడాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన అద్భుతమైన పాలన, అమృత కాల సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమ పథకాలు, అలాగే ప్రతి గ్రామ పంచాయతీకి కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధులు ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపే విధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
నరేంద్ర మోడీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని వన్నాల వెంకటరమణ అన్నారు. ప్రతి కార్యకర్త స్థానిక సంస్థల ఎన్నికల్లో సైనికుడిలా పనిచేయాలని, నెక్కొండ మండలంలో ప్రతి బూత్ స్థాయి నుంచి కార్యకర్తలు కష్టపడాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు దామచర్ల రామారావు, సుధానపు సారయ్య, ప్రధాన కార్యదర్శి రాంపల్లి రాజగోపాల్, కార్యదర్శులు సూత్రపు శీను, మల్లం మల్లేష్, సీనియర్ నాయకులు శ్రీరంగం శ్రీనివాస్, మాజీ మండల అధ్యక్షులు సింగారపు సురేష్, సురేతాలూరి లక్ష్మయ్య, మాజీ సర్పంచ్ పింగిలి మోహన్ రెడ్డి, లౌడియా శ్రీనివాస్, భరతం రాజు, ఉల్లెంగుల రాజు, కందుకూరి వెంకన్న, బొమ్మనపల్లి జయప్రకాష్, తౌడుశెట్టి శ్రీనివాస్, గుగులోతు వెంకన్న, అనిల్, యువ నాయకులు కుడికాల సుధీర్, తేజావత్ వంశీ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.