స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు హర్షనీయం
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి నేటిధాత్రి
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు హర్షనీయమని, కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శనివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్ ఆధ్వర్యంలో బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసి, టపాసులు కలిసి, మిఠాయిలు తినిపించుకుని సంబురాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే జీఎస్సార్ పాల్గొన్నారు. అనంతరం సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసి, మీడియాతో మాట్లాడారు.
సామాజిక న్యాయంతోనే అభివృద్ధి సాధ్యమని బలహీన వర్గాల హక్కుల కోసం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. ఎన్నికల ప్రణాళికలో కామారెడ్డి డిక్లరేషన్ లో బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ తెర మీదకు తీసుకోవచ్చామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కులగన చేపట్టి రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపారని అన్నారు. ఈ కార్యక్రమంలోప పట్టణ అధ్యక్షుడు దేవన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పం కిషన్ బుర్ర కొమురయ్య దాట్ల శ్రీను కురిమిళ్ళ శ్రీను రమణాచారి కోమల స్వామి కేతిరి సుభాష్ పద్మ చల్లూరు సమ్మయ్య కడారి మాలతి మాజీ కౌన్సిలర్లు, బిసి సంఘ నాయకులు, కాంగ్రెస్ పార్టీ వివిధ అనుబంధ సంఘ నాయకులు పాల్గొన్నారు