bavi thavakam prarambham, బావి తవ్వకం ప్రారంభం

బావి తవ్వకం ప్రారంభం

వేసవికాలంలో గ్రామపంచాయితీ పరిధిలోని ప్రజల దాహార్తిని తీర్చడానికి మంచినీటి బావిని తవ్వడానికి పనులు ప్రారంభించామని గ్రామ సర్పంచ్‌ గోడిశాల మమత సదానందంగౌడ్‌ తెలిపారు. మంగళవారం నర్సంపేట మండలంలోని గురిజాల గ్రామంలో గ్రామ ప్రజల దాహార్తిని తీర్చడానికి మంచినీటి బావిని గ్రామసర్పంచ్‌ చేతుల మీదుగా బావి తవ్వి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సహకారంతో పనులు ప్రారంభించామని చెప్పారు. గ్రామంలోని ప్రతి సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించి ప్రజలకు అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఆముదాల రమేష్‌, కొప్పు రాందాస్‌, గోడిశాల శ్రీనివాస్‌, గ్రామ నాయకులు మాటూరి రవీంద్రాచారి, ఏడ రమేష్‌, ఆవారి కన్నయ్య, మార్థ నవీన్‌, వేముల వేణు, బొడుసు స్వామి, నామాల రామయ్య, మచ్చిక రాజులతోపాటు గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *