
Fourth Class Employees Celebrate Bathukamma in Manchiryal
ఉద్యోగుల ఐక్యతకు ప్రతీకగా బతుకమ్మ సంబరాలు
నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు గీట్ల సుమీత్
మంచిర్యాల, నేటి ధాత్రి:
తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గీట్ల సుమీత్ మాట్లాడుతూ.. భగవంతుని ఆశీస్సులతో అందరు సుఖసంతోషాలతో ఉండాలని కోరుతూ మళ్ళీ వచ్చే సంవత్సరం లోపు తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగులకు ఇంటి స్థలాలు మంజూరైతే,తెలంగాణ నాల్గవ తరగతి హౌసింగ్ సొసైటీ ప్రాంగణంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.చిన్న స్థాయి ఉద్యోగులైన తమపై దేవుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కవిత రాణి, కోశాధికారి సుజాత, అసోసియేట్ అధ్యక్షులు శ్రీలత,శోభ,సునీత, ముంతాజ్ అలీ ఖాన్,గోవర్ధన్, శ్రీనివాస్,జయప్రద తదితరులు పాల్గొన్నారు.