ఏరియా జిఎం ఏ మనోహర్
మందమర్రి, నేటిధాత్రి:-
సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించూ ఫ్యామిలీ డే, సద్దుల బతుకమ్మ సంబరాలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఘనంగా నిర్వహించాలని ఏరియా జిఎం ఏ మనోహర్ సూచించారు. సోమవారం ఏరియా జిఎం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఫ్యామిలీ డే, సద్దుల బతుకమ్మ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించి, సంబంధిత అధికారులకు తగ్గు సలహాలు, సూచనలు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫ్యామిలీడే, బతుకమ్మ ఆటపాట కార్యక్రమాలలో సింగరేణి సేవా సమితి, లేడీస్ క్లబ్ సభ్యులు, పట్టణ మహిళలు, చుట్టుపక్కల గ్రామల మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని, కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించడానికి పట్టణంలోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానం, రామకృష్ణాపూర్ పట్టణంలోని ఠాగూర్ స్టేడియం లను బతుకమ్మ వేడుకలకు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్ఓటు జిఎం ఏ రాజేశ్వర్ రెడ్డి, కేకే ఓసిపి ప్రాజెక్ట్ అధికారి రమేష్, ఆర్కే ఓసిపి ప్రాజెక్ట్ అధికారి గోవిందరావు, ఏరియా ఆసుపత్రి డివైసిఎంఓ డాక్టర్ ఉష, కేకే గ్రూప్ ఏజెంట్ రామదాసు, ఎస్కే గ్రూప్ ఏజెంట్ విజయప్రసాద్, ఏరియా పర్సనల మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, డివైపిఎం ఎండీ ఆసిఫ్, అన్ని గనుల సంక్షేమ అధికారులు, రక్షణాధికారులు తదితరులు పాల్గొన్నారు.