
Batukamma Celebrations at Balaji Institutions
బాలాజీ విద్యాసంస్థల్లో– బతుకమ్మ సంబరాలు
నర్సంపేట,నేటిధాత్రి:
బాలాజీ విద్యాసంస్థల్లో బతుకమ్మ సంబరాలు వైభవంగా జరుపుకున్నారు.నర్సంపేట మండలం లక్నేపల్లిలోని బాలాజీ టెక్నో స్కూల్ లో బతుకమ్మ సంబరాలను ఎంతో ఘనంగా జరిగాయి.ముఖ్య అతిథులుగా బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఎ .రాజేంద్ర ప్రసాద్ రెడ్డి,ట్రెజరర్ డాక్టర్ ఎ .వనజ ప్రిన్సిపల్ పి. రాజేంద్ర ప్రసాద్ హాజరైనారు. డాక్టర్ ఎ. వనజ విద్యార్థులతో కలిసి ఆటపాటలతో పాలుపంచుకొని బతకమ్మ పండుగ నేపథ్యాన్ని వివరించారు.తెలంగాణలో బతుకమ్మ పండుగ వెయ్యి ఏండ్ల నాటిదని బతుకమ్మ పండుగ తెలంగాణ యొక్క సంస్కృతి ,సాంప్రదాయాలకు ప్రతీక అని,ప్రకృతిని, పుడమితల్లని స్థానికంగా దొరికే గుమ్మడి, తంగేడు, గునుగు, బంతి, చామంతి పూలతో అలంకరించి గౌరీ దేవికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ జరుపుకునే స్త్రీల పండుగ…ఈ పండుగ భాద్రపద మాసంలో పితృ అమావాస్య నుండి తొమ్మిది రోజులపాటు తీరొక్కపూలతో బతకమ్మను అలంకరించి ఆటపాటలతో ఆడుకుంటారని తెలిపారు.చివరి రోజు సద్దుల బతుకమ్మ నాడు పూల బతుకమ్మను నీటిలో నిమజ్జనం చేస్తారని చెప్పారు. నేడు బతుకమ్మ కేవలం పండుగ మాత్రమే కాకుండా తెలంగాణ అస్తిత్వానికి,సంస్కృతికి ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. స్త్రీల ఐక్యతను సామాజిక కలయికను ప్రోత్సహిస్తుందని పంటలు బాగా పండాలని ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ తెలుగువారు మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలలో కూడా ప్రవాసభారతీయులు అత్యంత వైభవోపేతంగా జరుపుకుంటారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.