మానవత్వానికి మారుపేరు బండి సదానందం యాదవ్.!

మానవత్వానికి మారుపేరు బండి సదానందం యాదవ్ – పేద కుటుంబానికి అండగా కాంగ్రెస్ నేత

మందమర్రి నేటి ధాత్రి

మందమర్రి మార్చి 1: “నాయకత్వం అంటే కేవలం పదవులు, ప్రసంగాలు కాదు… నిజమైన నాయకుడు ప్రజల కష్టాలను తనవిగా భావించి సహాయం చేయగలగాలి.” ఈ మాటలను అక్షరాలా నిజం చేస్తూ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, అఖిల భారత యాదవ మహాసభ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బండి సదానందం యాదవ్ మరోసారి మానవత్వానికి ప్రతీకగా నిలిచారు.కోటపల్లి మండలం జనగామ గ్రామానికి చెందిన కుకట్ల పొశం మల్లీశ్వరి, కుటుంబాన్ని పోషించేందుకు మందమర్రిలోని ఇందు గార్డెన్ ఫంక్షన్ హాల్ లో కష్టపడి పనిచేస్తున్నారు. ఆమె కుమార్తె అంజలి వివాహం ఈ నెల 9న జరగనుండగా, పెళ్లి ఖర్చులను ఎలా సమకూర్చుకోవాలనే ఆందోళనతో బాధపడుతున్నారనే విషయం తెలుసుకున్న బండి సదానందం యాదవ్, సహాయ హస్తం అందించేందుకు ముందుకొచ్చారు. తన స్వగృహంలో మల్లీశ్వరి దంపతులకు రూ. 50,000 నగదు మరియు పెళ్లి బట్టలు అందజేశారు. కాబోయే వధువు అంజలిని తన కుటుంబ సభ్యులా భావించి, ప్రేమతో ఆశీర్వదించారు.

“ప్రజలకు సేవ చేయడమే నా ధ్యేయం”

ఈ సందర్భంగా బండి సదానందం యాదవ్ మాట్లాడుతూ, “నాయకత్వం కేవలం రాజకీయాలకు పరిమితం కావాలి కాదు, సహాయం అవసరమైన వారి కోసం నిలబడటమే నిజమైన నాయకుడి లక్షణం. ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం నా అదృష్టం” అని పేర్కొన్నారు. సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వారు, ఇలాంటి సందర్భాల్లో తమ వంతు సహాయం అందించాలి అని పిలుపునిచ్చారు.

ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన మానవతా గుణం

సదానందం యాదవ్ చేసిన మానవీయ చర్య స్థానిక ప్రజల హృదయాలను హత్తుకుంది. “ఇలాంటి నాయకుల వల్లే సమాజం బాగుపడుతుంది” అని వార్డు పెద్దలు, మహిళలు ప్రశంసించారు. “అధికారంలో లేకున్నా పేదల కోసం నిలబడే నేతలు అరుదుగా కనిపిస్తున్నారు. సదానందం నిబద్ధతకు హృదయపూర్వక నమస్కారం” అంటూ పలువురు వ్యక్తం చేశారు.పేద ప్రజలకు అండగా నిలిచే గొప్ప మనస్సు ఉన్న నేతగా బండి సదానందం యాదవ్, సామాజిక సేవకు చిరునామాగా మారారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version