హెచ్ఎం అచ్ఛ సుదర్శన్
నడికూడ,నేటిధాత్రి:
ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులను చేర్పించాలని తల్లిదండ్రులకు అర్థమయ్యే రీతిలో నడికూడ మండల పరిధిలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ ఒగ్గు కథ ద్వారా ప్రభుత్వ పాఠశాలల యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ, ఒగ్గు కథ చెప్పించడం జరిగింది ఇప్పుడు ఆ కథ ఉపాధ్యాయ గ్రూపులలో వైరల్ అవుతూ,ప్రభుత్వ పాఠశాలలో ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ, రెండు జతల యూనిఫాం పంపిణీ,మధ్యాహ్న భోజనం, వారానికి మూడుసార్లు గుడ్లు,వారానికి ఒకసారి వెజ్ బిర్యానీ,అహ్లాదకరమైన తరగతి గదులు,విశాలమైన ఆట స్థలం అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులచే విద్యాబోధన ఆంగ్ల మధ్యమంలో జరుగుతుందని వారి యొక్క పాట రూపంలో సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా కథ చెప్పడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ తెలిపారు.
ఒగ్గు కథ బడిబాట ప్రచారాన్ని,వినూత్న రీతులలో వివిధ పద్ధతుల్లో ప్రచారం చేస్తున్న బడిబాట కార్యక్రమం ద్వారా విద్యార్థులు నమోదు చేసే కార్యక్రమాన్ని చేపట్టిన అచ్చ సుదర్శన్ ను పి ఆర్ టి యు రాష్ట్ర అధ్యక్షులు పింగిలి శ్రీపాల్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్ రావు,హనుమకొండ జిల్లా అధ్యక్షులు మందల తిరుపతిరెడ్డి,ప్రధాన కార్యదర్శి ఫలిత శ్రీహరి,వరంగల్ జిల్లా పి ఆర్ టి యు అధ్యక్షులు ఈదునూరి రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గఫార్, పరకాల మండల శాఖ అధ్యక్షులు మొడెం రాజేందర్ బాబు,ప్రధాన కార్యదర్శి గోల్ల రాజ్ కుమార్ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు అందరూ అచ్చ సుదర్శన్ ను అభినందించారు.