కారేపల్లి నేటి ధాత్రి
సింగరేణి భాగ్యనగర్ లో గూగులోత్ దళ్ సింగ్ గురుస్వామి (18వపడి) గారి కుమారులు డాక్టర్ రామ్ నివాస్ స్వామి ఆధ్వర్యంలో మహా పడిపూజ భజన కార్యక్రమం అశేష అయ్యప్ప భక్తులు హనుమాన్ స్వాములు జనావాహిని మధ్య అంగరంగ వైభవంగా జరిగినది
ఈ సందర్భంగా డాక్టర్ రామ్ నివాస్ స్వామి తన తండ్రి గారు అయినా దళ్ సింగ్ గురుస్వామిని 18వ పడి పూర్తి చేసుకున్న సందర్భంగా అయ్యప్ప స్వామి గురు శాలువాతో సన్మానించి పొన్ను కర్రను బహుకరించడం జరిగింది. ఈ సందర్భంగా గురు స్వాములు మాట్లాడుతూ 18వ పడి పూర్తి చేసుకోవడం అంటే పూర్వజన్మ సుకృతం కలిగి ఉండాలి అని అభిప్రాయపడ్డారు ఆ అదృష్టం కొందరికి మాత్రమే వస్తుంది అని భావోద్వేగానికి గురి అయ్యారు స్వాములు.