ఓటు హక్కు వినియోగం పై అవగాహన ర్యాలీ

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి మున్సిపల్ కార్యాలయం పరిధిలో ఎన్నికలలో ఓటర్ భాగస్వామ్యం ఓటు వేయడంపై ప్రజలను చైతన్య పరుచుట లో భాగంగా ఓటు హక్కు వినియోగం పై అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా మున్సిపల్ కమిషనర్ అనిల్ కుమార్ హాజరైనారు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా ఓటు వేయాలని, భూపాలపల్లి పట్టణంలో గత ఎన్నికల్లో జరిగిన పోలింగ్ శాతం 60 శాతం కు మించలేదని, ఈ సారి ఓటర్లను చైతన్యపరిచి, పోలింగ్ శాతం పెంచడానికి కృషి చేయాలని డి ఎల్ వో లకు సూచించారు.అంగ వైకల్యం ఉన్న ఓటర్లకు పోలింగ్ కేంద్రాల వద్ద వీల్ ఛైర్ సదుపాయం ఉంటుందని వారు కూడా ఓటు వేయొచ్చని తెలిపినారు. ప్రతి 2 కీ.మీ పరిధిలో ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని, పోలింగ్ కేంద్రాల వద్ద ఎండ వేడిమి లేకుండా టెంట్స్, త్రాగు నీరు కల్పించడం జరుగుతుందని, ఓటర్లు అందరూ స్వేచ్ఛయుత వాతావరణం లో తమ ఓటు వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ర్యాలీ మున్సిపల్ కార్యాలయం నుండి అంబెడ్కర్ విగ్రహం వరకు నిర్వహించడం జరిగింది. ఇట్టి ర్యాలీలో జిల్లా పరిషత్ సీఈవో విజయలక్ష్మి జిల్లా సంక్షేమ అధికారి నాగేశ్వర్ రావు మున్సిపల్ కమిషనర్ అనిల్ కుమార్ మేనేజర్ స్వామి ఆర్ ఐ భాస్కర్ మున్సిపల్ సిబ్బంది,అంగన్ వాడి,మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!