మంచిర్యాల, నేటి, ధాత్రి:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గౌడ కంఠం రక్షణ కవచం యంత్రంపై అవగాహన కార్యక్రమాన్ని బెల్లంపల్లి నియోజకవర్గం తాళ్ల గురజాల గ్రామంలో 22. 9. 2024 ఆదివారం రోజున బెల్లంపల్లి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ యంత్రంపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. ఇందుకుగాను గౌడ జన హక్కుల పోరాట సమితి తరఫున ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి మోకు దెబ్బ రాష్ట్ర అధికార ప్రతినిధి భూసారపు మొండి గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.తాండూరు,భీమిని,బెల్లంపల్లి,కాసిపేట మండలలలోని గీత కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని ఆయన కోరారు