పోలీస్ అధికారులకు కొత్త చట్టాలపై అవగాహన

జైపూర్, నేటి ధాత్రి:

రామగుండం పోలీస్ కమిషనరేట్ జైపూర్ సబ్ డివిజన్ పరిధి పోలీస్ అధికారులకు కొత్త చట్టాలపై ఎసిపి వెంకటేశ్వర్లు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. నాలుగు రోజులపాటు కొనసాగే కొత్త చట్టాల అవగాహన కార్యక్రమాన్ని జైపూర్ ఎస్ టి పి పి గెస్ట్ హౌస్ లో సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో ఆయన సమావేశమై శుక్రవారం రోజున ప్రారంభించారు.భారతీయ న్యాయ సమీకృత,భారతీయ నాగరిక్ సురక్ష సన్నిహిత,భారతీయ సాక్ష్యం, ఆధునిక కొత్త చట్టాల అమలు తీరును వివరించారు. ఈ కార్యక్రమంలో చెన్నూర్ రూరల్ సీఐ సుధాకర్, శ్రీరాంపూర్ సిఐ మోహన్, జైపూర్ ఎస్సై నాగరాజు, ఎస్సై సంతోష్, సబ్ డివిజన్ పరిధి పోలీస్ అధికారులు, హెడ్ కానిస్టేబుల్స్ ,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *