#నిస్వార్థ రాజకీయాలు చేసే వ్యక్తి మాధవరెడ్డి.
#ఓటమిని తట్టుకోలేక ప్రభుత్వంపై ఆరోపణలు.
#మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి.
నల్లబెల్లి, నేటి ధాత్రి: గత ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేక పెద్ది సుదర్శన్ రెడ్డి నియోజకవర్గంలో తన అనుచర వర్గంతో కలసి చిల్లర రాజకీయాలు చేస్తూ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తే ప్రజల చేత మళ్లీ గుణపాఠం తప్పదని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి అన్నారు శనివారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తను గెలిచినా తరువాత నియోజకవర్గని పట్టించుకోకుండా ఎన్నికల ముందు హడావిడిగా అమలు కాని జీవోలను తీసుకొచ్చి తన పార్టీ నాయకులకు కాంట్రాక్ట్ పనులను ఇప్పిoచుకొని వారివద్దనుండి ఐదు శాతం కమిషన్ తీసుకొని రోడ్ల పనులను ప్రారంభించారు ఎన్నికలలో ఓటమి చెందిన తరువాత పెద్దికి మతి బ్రమించి చిల్లర రాజకీయాలకు పాల్పడుతు తాను కాంట్రాక్ట్ పనులు ఇప్పించిన నాయకులచేత పనులను నిలిపివేంచి ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి పనులను అడ్డుకుంటున్నారని దుస్ప్రచారం చేస్తు ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేసి రాజకీయ పబ్బం గడుపుతున్నాడని ఇప్పటికైనాపెద్ది సుదర్శన్ రెడ్డి చౌకబారు రాజకీయాలు మానుకొని ప్రజలకి కల్గించిన అసౌకర్యానికి క్షమాపణ చెప్పి తాను పనులు ఇప్పించిన నాయకుల చేత రోడ్డు నిర్మాణం పనులు పూర్తి చేయించని యెడల ప్రజల చేతిలో మరోసారి భంగపాటు తప్పదు అని ఆయన హెచ్చరించారు .ఈ సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శి చార్ల శివారెడ్డి, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాలఅశోక్, ఇస్తారీ శేఖర్ గౌడ్ ,నాయకులు మాలోత్ చరణ్ సింగ్ ,పురుషోత్తం సురేష్ , పెంతల కొమురరెడ్డి , బౌసింగ్ ,జెట్టి రామూర్తి ,ఎరుకల రవీందర్ ,బత్తిని మల్లయ్య, వడ్లురి రమేష్, పోగుల కుమారస్వామికృష్ణ, ఇమ్మడి కుమారస్వామి ,మధు ,రఘపతి, వైనాలపవన్, నల్లగొండ సుధాకర్, గండు మహేందర్, అంగోత్ రఘు, బోట్ల కుమారస్వామి, సారయ్య , మొగిలి తదితరులు పాల్గొన్నారు.