కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమా వేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన

పరిషత్ చైర్మన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి

కూకట్పల్లి, ఫిబ్రవరి 24 నేటి ధాత్రి ఇన్చార్జి

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ కార్య కర్తల విస్తృతస్థాయి సమావేశం కాం గ్రెస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవ ర్గ ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్ అధ్యక్షత నల్లగండ్ల, హైదర్నగర్లోని రాం నరేష్న గర్ కమ్యూనిటీ హాల్లో జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి హాజ రయ్యారు.వారితో పాటు పాల్గొన్న గొట్టు ముక్కల వెంకటేశ్వర రావు (జీవీఆర్) అన్న.ఈ కార్యక్రమంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అను సరించాల్సిన విధి విధానాల పైన కార్యకర్తల అభిప్రాయాలు సేకరించ డం జరిగింది.పట్నం సునిత మహెం దర్ రెడ్డి,జగదీశ్వర్ గౌడ్ మాట్లాడు తూ ….కార్యకర్తలు అందరూ సమి ష్టిగా కృషి చేసి చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ
గెలుపుకు కృషి చేయాలని వారు కోరారు.కార్యక్రమంలో సీనియర్ నాయకులు కూన సత్యం గౌడ్ నల్ల సంజీవరెడ్డి వీరేందర్ గౌడ్,శ్రీకాం త్,ఫయాజ్ భాయ్,ఇలియాస్ షరీఫ్,ముజ్జుబాయ్,మారుతికుమార్,రాజిరెడ్డి,కాంగ్రెస్ మహిళా నాయ కురాలు శిరీష సత్తుర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!