క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని చాటాలి

 

బీసీ సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ రాంరెడ్డి

నేటిధాత్రి కమలాపూర్ (హనుమకొండ)
కమలాపూర్ మండల జే ద్రంలోని మహాత్మా జ్యోతి భాపులే బీసీ సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల మైదానంలో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి (అండర్-17)” గేమ్స్&స్పోర్ట్స్ మీట్”నిర్వహించారు. ఈ కార్యక్రమ ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాంరెడ్డి,ప్రత్యేక అతిథిగా కమలాపూర్ పోలీస్ ఇన్స్పెక్టర్ బి. సంజీవ్ హాజరయ్యారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి జాతీయ జెండా ను ఎగుర వేశారు. తర్వాత ఒలింపిక్ కాగడా ను వెలిగించి జాతీయస్థాయి క్రీడాకారులు మైదానంలో కాగడాతో పరుగుగెత్తారు.పాఠశాల అవరణములో ఏర్పాటు చేసిన సమావేశంలో రాoరెడ్డి మాట్లాడారు..ఓటమి,గెలుపును సమానంగా స్వీకరించాలని క్రీడాకారులకు సూచించారు. కమలాపూర్లో స్పోర్ట్స్ మీట్ నిర్వహించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. సీ.ఐ.సంజీవ్ మాట్లాడుతూ… తన చిన్న నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తదనంతరం వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. ఇరువురు అధికారులు క్రీడాకారులతో వాలీబాల్ ఆట ఆడారు.సుమారు 600మంది క్రీడాకారులు ఈ స్పోర్ట్స్ మీట్ లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంజేపీ బాలుర గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ఓదెల మల్లయ్య, ఎంజీపీ గురుకులాల జిల్లా కన్వీనర్ సరిత, ప్రిన్సిపల్స్ ప్రఫుల్లా దేవి, వెంకటేశ్వర్లు, రాజ్ కుమార్, లక్ష్మయ్య, వైస్ ప్రిన్సిపల్ విజయ్ కుమార్,పీఈటీలు నాగరాజు, వెంకటేష్, కిషోర్ కుమార్, క్రీడాకారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!