వైదిక జ్యోతిష్య సమ్మేళనంలో శ్రవన్ శాస్త్రికి ఆహ్వానం
#నెక్కొండ, నేటి ధాత్రి:
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల వాస్తు జ్యోతిష పండితుల ఆధ్వర్యంలో విజయవాడలో ఈనెల 23 న జరిగే జాతీయస్థాయి వైదిక జ్యోతిష్య సమ్మేళనానికి వరంగల్ జిల్లా నెక్కొండకు చెందిన ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు శ్రవన్ శాస్త్రి బూరుగుపల్లికి ఆహ్వానం అందింది.విశ్వజ్యోతి జ్యోతిష విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం రోజున విజయవాడలో నిర్వహించనున్న వైదిక జ్యోతిష సమ్మేళనానికి వివిధ ప్రాంతాల నుండి ఎంపిక చేసిన వాస్తు సిద్ధాంతులు, జ్యోతిష్య పండితులను ఆహ్వానించగా వారిలో తనకు చోటు దక్కడం సంతోషంగా ఉందని శ్రవణ్ శాస్త్రి శుక్రవారం తెలిపారు. రాబోయే తెలుగు సంవత్సరం శ్రీ విశ్వావసు నామ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని రెండు సెషన్లుగా జ్యోతిష్య సమ్మేళనం నిర్వహిస్తున్నారు. పలు జ్యోతిష్య ,వాస్తు గ్రంథాల రచయిత, దైవజ్ఞరత్న పుచ్చా శ్రీనివాసరావు చే
ద్రేక్కాణ చక్ర రహస్యాలు,
శతాధిక జ్యోతిష గ్రంధ సంకలనకర్త ఆదిపూడి శివ సాయిరామ్ చే
జాతక దోషాలు- సులభ నివారణలు,
జ్యోతిష గ్రంథ రచయిత
శ్రీ పాలపర్తి శ్రీకాంత శర్మ తో
ప్రశ్నా జ్యోతిషం- ఫలితాలు,
శ్రీ కంచి కామకోటి సర్వజ్ఞ పీఠ ఆస్థాన సిద్ధాంతి
లక్కావఝుల విజయసుబ్రహ్మణ్య సిద్ధాంతి
తో వైదిక జీవనం-అనుసరణీయం అనే అంశాలపై ప్రసంగాలు,
శ్రీ శృంగేరి శంకర మఠం – శ్రీ మహాలక్ష్మి ఆలయ ధర్మాధికారి- ఇంద్రకంటి వెంకట గోపాలకృష్ణ శర్మ, రాజమండ్రి కి చెందిన బహు గ్రంథ రచయిత గురురాజేష్ కొటేకల్, పంచాంగ కర్త శ్రీనివాస శశికాంత్ శర్మతో సమకాలిన వాస్తు జ్యోతిష అంశాలపై చర్చ గోష్టి ఉంటుందన్నారు.ప్రముఖ వైదిక జ్యోతిష వాస్తు పండితులతో నిర్వహించే ఈ సమ్మేళనం కో ఆర్డినేటర్ డాక్టర్ డి విశ్వనాథ్ నుండి ఆహ్వానం అందినట్లు శ్రవణ్ శాస్త్రి తెలిపారు.