పాలిస్టర్ వస్త్రానికి పవర్లూమ్ కార్మికులకు అసాములకు ఒప్పందం ప్రకారం కూలీ ఇవ్వాలి
సిఐటియు ఆధ్వర్యంలో పాలిస్టర్ అసోసియేషన్ ఆఫీస్ ముందు ధర్నా
సంఘం అధ్యక్ష కార్యదర్శులకు వినతిపత్రం అందజేత
యజమానుల సంఘం అధ్యక్ష కార్యదర్శుల హామీ
సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):
సిరిసిల్ల పట్టణ కేంద్రలోని పాలిస్టర్ వస్త్రానికి సంబంధించి పవర్లూమ్ కార్మికులకు , ఆసాములకు కూలీ తగ్గించి ఇస్తున్న యజమానుల వైఖరికి నిరసనగా వెంటనే కూలీ పెంచి ఇవ్వాలనే డిమాండ్ తో ఈరోజు సి.ఐ.టి.యు ఆధ్వర్యంలో పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తి దారుల సంఘ భవనం ముందు ధర్నా చేపట్టి సంఘం అధ్యక్ష , కార్యదర్శులు ఆడెపు భాస్కర్,అంకారపు రవి లెటర్ ఇవ్వడం జరిగినది.
ఈ సందర్భంగా వారు కార్మిక సంఘ నాయకులు మూషం రమేష్ , కోడం రమణ మరియు కార్మికులతో చర్చలు జరిపి రెండు రోజుల వరకు యజమానులు అందరితో సమావేశం ఏర్పాటు చేసి కూలీ పెంచి ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ సందర్భంగా CITU – పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్ , జిల్లా అధ్యక్షులు కోడం రమణ మాట్లాడుతూ పాలిస్టర్ వస్త్రానికి పవర్లూమ్ కార్మికులకు ఆసాములకు గత సంవత్సర కాలంగా ఒప్పందం ప్రకారం కూలి చెల్లించకుండా కార్మికులకు నష్టం చేసే విధంగా యజమానులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.ఇప్పటికైనా యజమానులు వెంటనే ఒప్పందం ప్రకారం కూలి చెల్లించాలని లేకుంటే కూలి తగ్గించి ఇస్తున్న యజమానులపై లేబర్ ఆఫీసులో కేసులు నమోదు చేయిస్తామని అవసరమైతే నిరవధిక సమ్మెకు కూడా వెళ్తామని అన్నారు.