
మాజీ సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి
వీణవంక,( కరీంనగర్ జిల్లా).
నేటి ధాత్రి:వీణవంక మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావుకు ఓటు వేసి గెలిపించాలని విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.
వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి ఉపాధి హామీకూలీల వద్ద కు వెళ్లి 400 మందికి టిఫిన్ ఏర్పాటు చేసిన మాజీ సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న 6 గ్యారంటీ లకు 4 పథకాలను అమలు పరిచిన విధానని కూలీల కు వివరించి రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కేంద్రం లో అమలు చేయబోయే గ్యారంటీ పథకాలను వివరించి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు నల్ల కొండల్ రెడ్డి, సాహెబ్ హుస్సేన్, దూలం సమ్మయ్య, పల్లెర్ల కిరణ్, నిమ్మల సమ్మయ్య,జగన్ రెడ్డి, మోహన్ రెడ్డి, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.