టీ వై జె ఎఫ్ జర్నలిస్టు పిల్లలకు 100 శాతం ఫీజు రాయితీ.

టీ వై జె ఎఫ్ జర్నలిస్టు పిల్లలకు 100 శాతం ఫీజు రాయితీ

◆ టీ వై జె ఎఫ్ జహీరాబాద్ అధ్యక్షులు అనిల్ కుమార్

జహీరాబాద్ నేటి ధాత్రి:

shine junior college


సంగారెడ్డి/జహీరాబాద్:నిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు విద్యాసంస్థల్లో నూటికి నూరు శాతం ఫీజు రాయితీని కల్పించాలని ( టీ వై జె ఎఫ్) తెలంగాణ యూత్ జర్నలిస్టు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు తనుగుల జితేందర్ రావు, ఆదేశాల మేరకు జహీరాబాద్ అధ్యక్షులు అనిల్ కుమార్, ఉపాధ్యక్షుడు నగేష్, ఆధ్వర్యంలో సోమవారం నాడు సంగారెడ్డిలో డిఈఓ వెంకటేశ్వర్లు ను కలిసి వినతి పత్రం సమర్పించారు. టీ వై జె ఎఫ్ జహీరాబాద్ అధ్యక్షులు అనిల్ కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి తమ సంఘం పాటుపడుతుందని వివరించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలు కోసం జర్నలిస్టులు నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో చాలామంది జర్నలిస్టులు తమ కుటుంబాన్ని కూడా పట్టించుకోవడంలేదని అన్నారు పేద మధ్యతరగతి వర్గాల వారే ఎక్కువమంది జర్నలిస్టులు ఉన్నారని చెప్పారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో వారి పిల్లలకు ఫీజు రాయితీ కల్పించడం ద్వారా ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. అంతేకాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా అర్హులైన వారికి అందించాలని విజ్ఞప్తి చేశారు. సంగారెడ్డి జిల్లాలో ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రైవేటు విద్యాసంస్థల్లో నూటికి నూరు శాతం ఫీజు రాయితీని జర్నలిస్టుల పిల్లలకు కల్పించాలని డీఈఓ ను కోరారు గతంలో కొందరు ప్రైవేటు విద్యాసంస్థలవారు డీఈవో ఉత్తర్వులను కూడా అమలు చేయలేదని ఆరోపించారు ఈసారి ఆ విధంగా కాకుండా కచ్చితంగా ప్రతి విద్యా సంస్థ వారు అమలు చేసే విధంగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు దీనికి డీఈఓ వెంకటేశ్వర్లు సానుకూలంగా స్పందించారు. జర్నలిస్టు పిల్లలకు నూటికి నూరు శాతం రాయితీని అందే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఝరాసంగం మండల టీ వై జె ఎఫ్ అధ్యక్షులు ఎర్రోళ్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version