సీఎం చిత్రపటానికి పాలాభిషేకం.

Congress party Congress party

సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

నిజాంపేట నేటి ధాత్రి:

 

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సహాయంగా ఎకరాకు 6000 చొప్పున ఆర్థిక సహాయం అందించడం గొప్ప విషయం అని నస్కల్ గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మద్దికుంట శ్రీను అన్నారు. నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ నిరుపేదల పెన్నిధి సీఎం రేవంత్ రెడ్డి అని కొనియాడారు .రాష్ట్రంలో పేదల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. అనంతరం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేశారు ఇందిరమ్మ లబ్ధిదారులు దొంతరమైన ఎల్లవ్వ మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుండి ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నామన్నారు కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి , మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సహకారంతో ఇల్లు కట్టుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో దేశెట్టి సిద్ధ రాములు, బక్కన్న గారి లింగం గౌడ్, నాతి లక్ష్మా గౌడ్, అజయ్, దేవరాజు యాదవ్, మెట్టు వెంకట్ , దేశెట్టి రాజు, రమేష్, సురేష్ ,కిషన్, సత్యం తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!