ఉద్యోగంలో లీలలు…ఉద్యోగులతో రాసలీలలు!

`మంత్రికి తెలియకుండానే నియామకాల?

`అక్రమార్కుడికే అందలమా.

 

`మంచి ఆటగాడు ఆ ‘‘అంజయ్య’’?

`నకిలీ పత్రాలతో ప్రమోషన్లు!

`రిటైర్‌ అయినా కొత్త కొలువులు!

`’’అంజయ్య’’ మళ్లా కొలువెక్కిండు!

`పులిహోర కలపడంలో మేటి…కొలువులు తెచ్చుకోవడంలో ఘనాపాటి

`’’అంజయ్య’’… మళ్లా కొలువెట్లొచ్చిందయ్యా?

`’’అంజయ్య’’కు మరో రెండేళ్లు ఉద్యోగం!
`ఔట్‌ సోర్సింగ్‌ వెసులుబాటు సద్యోగం!

`’’ఏడుపాయల’’ దేవాలయంలో పెద్ద నౌకరే!

`నకిలీ సర్టిఫికేట్‌ తో అప్పట్లో ప్రమోషన్‌.

`క్రిమినల్‌ కేసు నమోదుతో బైట పడ్డ భాగోతం.

`తన కింద పని చేసే మహిళలతో ‘‘కేళీ కలాపం’’!

`అప్పట్లో దేవాదాయ శాఖలో సంచలనం.

`వసతీ గృహం నిర్మాణంలో చేతి వాటం.

`లక్షల రూపాయలు తిన్నట్లు తేలిన పర్వం.

`అధికారులు ‘‘అంజయ్య’’ గుప్పిట్లో!

`రిటైర్‌ అయినా మరో రెండేళ్లు కుర్చీలో!!

`’’అంజయ్య’’ మీద కనికరం… రెండేళ్లకు కొలువు వరం!

`అన్నిట్లో ఆరితేరినోడు ‘‘అంజయ్య’’!

`’’అంజయ్య’’ మీద అంత ప్రేమెందుకయ్యా ‘‘రామకృష్ణయ్య’’!

`అమ్మ వారి గుడిలో అపవిత్రుడికి కొలువేందయ్య!

`రసరాజు ‘‘అంజయ్య’’కు రెండేళ్లు ఔట్‌ సోర్సింగ్‌ ఎందుకయ్యా!

`గుడి ఎనక నా సామి గుడిసేటి ఏశాలు తెలిసినా ఇదేం పనయ్యా?

`’’అంజయ్య’’ మీద పిర్యాదు చేసిన ‘‘రామకృష్ణ’’ కొలువిచ్చిండు.
`అవినీతి అధికారికి మరో అవకాశం కల్పించిండు.

పైదరాబాద్‌,నేటిధాత్రి:
అష్ట దరిద్రుడికి నిత్య కళ్యాణమట.. ఇది చదివితే నిజమేనేమో అనిపిస్తుంది. ఒక వ్యక్తి అత్యంత వివాదాస్పదుడు అని తెలిసిన తర్వాత అతన్ని అందలం ఎక్కించడం దుర్మార్గం. వ్యవస్దకు పట్టన గ్రహణం. అంజయ్య అనే దేవాదాయశాఖలో పనిచేసిన ఉద్యోగి చేసిన అక్రమాలు, అవినీతి అంతా ఇంతా కాదు. ఇక దుర్మార్గాల గురించి ఒక్క ముక్కలో చెబితే సరిపోతయేంత చిన్నది కాదు. అన్ని లీలలు తెలిసిన ఉద్యోగి. రాసలీలల్లో ఆరితేరిన వ్యక్తి. ఇంత గొప్ప నీచ చరిత్ర వున్న అంజయ్య ఇటీవలే ఉద్యోగం నుంచి రిటైర్‌ అయ్యారు. అలా అయ్యారో లేదో ఇలా మళ్లీ కొలువు తెచ్చుకున్నాడు. ఈ ఏడాది జనవరిలో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ అదికారిగా విధులు నిర్వహించిన అంజయ్య రిటైర్‌ అయ్యారు. ఏవో కొ ంపలు మునిగిపోయినట్లుగా, దేవాదాయ శాఖలో మరెరూ లేనట్లుగా రెండేళ్లపాటు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగం కల్పిస్తూ పిబ్రవరి 19న దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విచిత్రమేమిటంటే గతంలో అంజయ్య పెద్ద అవినీతి పరుడు. దేవాదాయ సొమ్మును కాజేస్తున్నాడు. దర్శశాల నిర్మాణం కోసం దాతలు ఇచ్చిన సొమ్మును అంజయ్య మింగేశాడు. అని రిపోర్టు ఇచ్చిన ఉన్నతాదికారి రామకృష్ణ ఇప్పుడు అదే అంజయ్యకు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రెండేళ్లపాటు ఏడుపాయల వన దుర్గాభవాని ఆలయంలో అడ్మినిస్ట్రేటివ్‌ అధికారిగా కొలువును ప్రసాదం పంచినట్లు ఇచ్చేశారు. దీన్నే దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నారని చెప్పుకుంటారు. గతంలోనే నకికీ సిర్టిఫికెట్‌ ఆరోపణలు అంజయ్య మీద వున్నాయి. ఆలయం నిధులను మింగినట్లు విమర్శలున్నాయి. విజిలెన్స్‌ అదికారులు కూడా లెక్కలుతేల్చి, రిపోర్టు కూడా ఇచ్చారు. వాటిని ఎప్పుడో పక్కన పెట్టారు. ప్రమోషన్ల మీద ప్రమోషన్లు ఇచ్చారు. రిటైర్‌ అయినా సరే మళ్లీ అంజయ్యను తెచ్చి సీట్లో కూర్చొబెడుతున్నారు. ఎన్నికల కోడ్‌ అమలులోవుందన్న సోయి కూడా ఉన్నతాధికాలకు లేకుండాపోయింది. ఎవరు పట్టించుకుంటారు లే అనుకున్నారో లేక, మాకు ఎదురేముందిలే అని అనుకున్నారో గాని పోస్టింగ్‌ ఆర్టర్‌ ఇచ్చేశారు. సహజంగా ప్రభుత్వ ఉద్యోగులంటే ఎంతో ఆదర్శంగా వుండాలి. వారి జీవితం ప్రజలకు మేలు చేసేలా వుండాలి. ఎల్లప్పుడూ సేవచేసేలా వుండాలి. ప్రజలకు అందుబాటులో వుండాలి. సేవ చేయడంలో అందరికన్నా ముందుండాలి. అదే ప్రభుత్వ శాఖలో మరింత గొప్పగా జీవితాలను గడపాల్సిన వారు దేవాదాయశాఖలో వుండాలి. ఆ శాఖలో పనిచేసే వారికి సమర్ధత ఒక్కటే కొలమానం కాదు. వారి వ్యవహారశైలి కూడా ఎంతో కీలకం. వారి ఆలోచన దగ్గర నుంచి వారు నడుచుకునే విధానం కూడా సరిగ్గా వుండదకూడదు. కలలో కూడా తప్పటడుగు వేయకుండా వుండాలి. ప్రజా దనం దుర్వినియోగం చేయకుండా వుండాలి. ముఖ్యంగా హిందువులు ఎంతో పవిత్రంగా కొలిచే స్థలాలైన గుళ్లలో పనిచేసే అధికారులు ఎంతో పవిత్రంగా వుండాలి. వారి మనసు అంతకన్నా పవిత్రంగా వుండాలి. ఏ చిన్న పొరపాటు చేయడానికి కూడా భయపడాలి. దేవుడంటే హిందువులకు ఎంతో నమ్మకం. దేవుడంటే ప్రతి వారికి భక్తి వుంటుంది. తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడనే భయం వుంటుంది. కాని కోట్లాది మంది ఎంతో భయభక్తులతో దేవుళ్లను సందర్శించి వారి తప్పులను మన్నించమని వేడుకుంటారు. అలాంటి ఎంతో పవిత్రమైన స్ధలాలలో ఉద్యోగాలు చేసే ఉద్యోగులు ఎలావుండాలి. ఎంతో ఆదర్శవంతమైన జీవితం గడపడమే కాకుండా, ఆ దేవునిపై అచెంచలమైన భక్తిభావం వుండాలి. అంతకన్నా కొన్ని వందల రెట్ల భయం వుండాలి. కాని గుళ్లలో పనిచేసే కొంత మంది ఉద్యోగుల జీవితాలు ఎంత నీచంగా వుంటాయంటే చెప్పడానికి కూడా అలవి కాకుండా వుంటాయి. అంత దుర్మార్గంగా వుంటాయి. మరికి వారికి దేవుడంటే భయం లేకుండా, నిర్భీతిగా, నిర్లజ్జగా, నిర్లక్ష్యంగా అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతుంటారు. ఇంకాకొంత మంది ఓ అడుగు ముందుకేసి చేయకూడని పనులు చేస్తుంటారు. అలా పవిత్రమైన స్ధలాలో కొలువు చేస్తూ నీచమైన పనులు చేస్తూ తనకుతానుగా దొరికిపోయిన ఉద్యోగి అంజయ్య. కొమురవెళ్లి దేవస్దానంలో చిన్న ఉద్యోగిగా కొలువులో చేరిన అంజయ్య కష్టపడి అంచెలంచెలుగా ఎదగలేదు. భక్తులకు సేవ చేసి పేరు పొందలేదు. ఉత్తమ ఉద్యోగిగా ఎక్కడా పేరు లేదు. ఎవరు అంజయ్య గురించి చెప్పినా నీచం,నికృష్టం అనే చెబుతుంటారు. మరి అలాంటి వ్యక్తికి ఉన్నతాధికారులు ఎందుకు సహకరించారన్నది అంతుచిక్కని ప్రశ్న. అంటే కింది స్దాయి నుంచి పై స్ధాయిదాకా ఎంతో పవిత్రమైన దేవాదాయశాఖలో కీచకులు, కామకులు, లంచావతారులు తిష్టవేశారని చెప్పడంలో సందేహం లేదు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? అంటే ఇదే మరి. ఒక ఉద్యోగి ఆలయ నిధులు దుర్వినియోగం చేస్తున్నాడని తెలిసినా పై అధికారులు ఎందుకు ఉపేక్షిస్తూ పోయారన్నది కూడా తేలాల్సివుంది. తాను చేరుకోవాల్సిన రైలు జీవిత కాలం లేటు అంటూ గతంలో చెప్పుకునేవారు. దేవాదాయ శాఖలో చూస్తే జీవితం అయిపోయినా కూడా గమ్యం చేరని ప్రయాణంలా సాగుతుంటాయి. అందుకే అవినీతికి పాల్పడిన, అనేక అక్రమాలు చేసిన అధికారులు కూడా తప్పించుకుంటున్నారు. ఏకంగా రిటైర్‌ అయిపోతున్నారు. కాని కేసులు అలాగే పెండిరగ్‌లో వుంటున్నాయి. అసలు విషయానికి వస్తే కొమురవెళ్లిలో జూనియర్‌ అసిస్టెంటుగా మొదలైంది అంజయ్య జీవితం. నికిలీ సర్టిఫికెట్‌తో ప్రమోషన్‌ పొందాడన్నది రుజువైంది. క్రిమినల్‌ కేసు కూడా నమోదైంది. అన్నీ తెలిసినా అంజయ్యకు ప్రమోషన్‌ ఇచ్చారు. క్రిమినల్‌ కేసు నమోదైన తర్వాత కూడా ఆయనను ఉద్యోగంలో నుంచి తొలగించలేదు. చిన్న ట్రాన్ఫ్‌ఫర్‌తో సరిపెట్టారు. అదే శిక్ష అని దేవాదాయశాఖ అదికారులు చేతులు దులుపుకున్నారు. ఇలా పై అదికారులు ఆశీస్సులు వున్న అంజయ్య లాంటి వారి వ్యవహార శైలి విచ్చలవిడి తనాన్ని మరింత పెంచుకుంటుంది. అందుకే అంజయ్యకు భుక్తులంటే చులకన. దేవుడంటే భయం వుండదు. భక్తి వుండదు. పవిత్రమైనస్ధలంలో కొలువు చేస్తున్నామన్న సోయి కూడా వుండదు. ఇక కొమురవెళ్లి దేవస్దానంలో పనిచేసే మహిళా ఉద్యోగుల పట్ల ఆయన చేష్టలు మరీ దుర్మార్గంగా వుండేవి. మహిళా ఉద్యోగులు తనకు లొంగిత ఒక లెక్క..లొంగకపోతే మరో లెక్క. అంతే కాదు తనుకు లొంగిన మహిళలతో పోటోలు దిగి, వారిని బ్లాక్‌ మెయిల్‌ చేయడం కూడా అలవాటు చేసుకున్నాడు. ఆ ఫోటోలు కూడా గతంలో బైట పడ్డాయి. ఇలా పవిత్రమైన స్ధలంలో మహిళలను వేదింపులకు గురిచేయడమే కాదు, వారి లొంగదీసుకొని కేళీ కలాపాలు నిర్వహించాడు. అయినా అదికారులు పట్టించుకోలేదు. అంజయ్యపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంటే దేవాదాయ శాఖ ఎంత భ్రష్టుపట్టిపోయిందో అర్దం చేసుకోవచ్చు. తన కింద పనిచేయాలంటే మహిళా ఉద్యోగులు గజగజ ఒనికిపోయేవారు అని చెబుతుంటారు. ఇక ఆలయం శుభ్రం చేసే స్వీపర్లను బానిసలకన్నా హీనంగా చూసేవాడు అనే ఆరోపణలు అనేకం వున్నాయి. వారు అంజయ్య చెప్పినట్లు చేయాలి. లేకుంటే ఉద్యోగాలు పోతాయని భయపెట్టేవాడు. వారు సర్వస్వం అర్పించుకునేలా చేసేవాడని అప్పట్లో అనేక విమర్శలు వచ్చాయి. అందుకు సాక్ష్యంగా కూడా అనేక ఫోటోలు కూడా బైటకు వచ్చాయి. కాని దేవాదాయాశాఖ పై స్ధాయి అదికారులు అంజయ్య మీద చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే గుడి సొమ్మును అప్పనంగా మింగుతూ పై స్ధాయి అదికారులకు వాటాలు పంపుతుండేవారని సాటి ఉద్యోగులే చెబుతుంటారు. అంతే కాదు పై అదికారులు ఆశలు ఎలాంటివైనా తీర్చేవాడని అందుకే అంజయ్యపై ఎలాంటి చర్యలు తీసుకోకపోయేవారని చెబుతుంటారు. ఇంత కాలం తప్పుడు పనులు చేసిన అంజయ్యకే ఉన్నతాదికారులు అండదండలు అందించారు. రిపోర్టులను బుట్టదాఖలు చేశారు. నిధులు మింగినా చర్యలు తీసుకోలేదు. పైగా ప్రమోషన్లు ఇచ్చి ప్రోత్సహించారు. అంటే అంజయ్య చేసిన తప్పులలో ఉన్నతాధికారులకు వాటాలున్నట్లు వాళ్లే అంగీకరించనట్లు కాదా? తమకేం తెలియదన్నట్లు ప్రకటనలు చేస్తారా చూడాలి.
మంత్రిగారు…ఈ దుర్మార్గం చూడండి.
ప్రభుత్వానికి తెలియకుండా చీమ చిటుక్కుమనకూడదు. దేవాదాయా శాఖ కొండా సురేఖకుతెలియకుండా ఒక్క ఫైలు కూడా కదలకూడదు. కాని ఉద్యోగాల నియామకాలు మంత్రికి తెలియకుండానే జరిగిపోతున్నాయా? సాక్ష్యానికి అంజయ్య నియామకం ఒక్కటి చాలు. ఉద్యోగాల కోసం ఎంతో మంది ఎదరుచూస్తున్నారు. వాళ్లందరినీ కాదని ఉన్నతాదికారులు అంజయ్యకే ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగం ఎందుకిచ్చినట్లు? ఇక పోతే సంబంధిత మంత్రికి తెలియాల్సిన అవసరం లేదా? ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల నియామకం మొత్తం అదికారుల చేతుల్లోనే వుందా? అలా అని ప్రభుత్వం వారికి స్వేచ్ఛనిచ్చిందా? అదే నిజమైతే కొత్తగా అర్హులైన నిరుద్యోగిని ఎంపిక చేయొచ్చు. లేకుంటే రిటైర్‌ అయిన నిజాయితీ పరుడైన ఉద్యోగికి ఇవ్వొచ్చు. పవిత్రమైన గుడిలో కొలువు చేస్తూ అపవిత్రమైన పనులు చేసే అంజయ్య లాంటి ఉద్యోగికి మళ్లీ ఔట్‌ సోర్సింగ్‌ కొలువంటే అపచారం కాదా? తెలంగాణలో ఏడుపాయల జాతర అంటే ఎంతో గుర్తింపు వుంది. వనదుర్గాభవాని అంటే మూడు నాలుగు రాష్ట్రాల నుంచి కొన్ని లక్షల మంది భక్తులు దర్శనం కోసం ఏటా వస్తుంటారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువుగా, భక్తులకు కొంగు బంగారమైన ఎంతో శక్తి వంతమైన మహిమాన్విత క్షేత్రంలో అంజయ్య లాంటి లోలుడికి ఉద్యోగం ఇవ్వడాన్ని భక్తులంతా తప్పు పడుతున్నారు. ఇలాంటి వ్యక్తి నియామకం వల్ల ప్రభుత్వం అబాసుపాలయ్యే అవకాశం వుంది. మంత్రికొండా సురేఖ తక్షణం స్పందించి, అంజయ్య మీద వున్న ఆరోపణలపై విచారణ జరిపించాలని కోరుతున్నారు. రిటైర్‌ అయినంత మాత్రాన ఆయన చేసి అవినీతి మాసిపోదంటున్నారు. పైగా మళ్లీ అంజయ్య అంత సుద్దపూస లేడన్నట్లు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగం ఇచ్చిన అదికారులపై కూడా దృష్టిపెట్టాలని భక్తులు కోరుతున్నారు. అంజయ్య అవినీతిలో ఉన్నతాదికారుల వాటా కూడా తేల్చాలంటున్నారు. లేకుంటే దేవాదాయశాఖలో ఇలాంటి ప్రబుద్దలు మరింత పెరిగిపోయే అవకాశాలున్నాయి. భక్తుల మనోభావాలు దెబ్బతినే ప్రమాదముంది. అందువల్ల మంత్రి కొండా సురేఖ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!