నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి:
అంగన్వాడీ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని వారి సమస్యలను పరిష్కరించాలనిసిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి అన్నారు. గురువారం అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె నాలుగవ రోజు చేరుకుంది… . ఈ సందర్భంగా, వారు మాట్లాడుతూ, ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని, వారి సమస్యలను పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,అంగన్వాడి సిబ్బందితో ప్రభుత్వం వెట్టి చాకిరి చేయించుకుంటుందని ఆరోపించారు. వీరిచే ఇతర పనులు కూడా చేయించుకుంటూ శ్రమను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. రికార్డుల నిర్వహణ పేరిట అధికారులు వేధింపులు గురి చేస్తున్నారని, కొత్త యాప్ లు తీసుకొచ్చి మానసికంగా ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీలకు కనీస వసతులు కరువయ్యాయని పేర్కొన్నారు. పనికి తగ్గ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పిఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని, గతంలో మంత్రి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని కోరారు. అదనపు పనులను రద్దు చేయాలని, అంగన్వాడీల పై ప్రజాప్రతినిధుల పెత్తనాన్ని నివారించాలని కోరారు. పెండింగ్ లో ఉన్న టిఎ, డిఎ ఇతర అలవెన్స్ ను వెంటనే విడుదల చేయాలన్నారు. సకాలంలో జీతాలు, అద్దె, కూరగాయలు, గ్యాస్ బిల్లులు ఇవ్వాలన్నారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారం అయ్యేంతవరకు అంగన్వాడీ సిబ్బంది చేసే సమ్మెకు పూర్తిగా మద్దతుగా ఉంటామని చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా గౌరవ అధ్యక్షులు చాపల శ్రీను, సిఐటియు చండూరు మండల కన్వీనర్ జెర్రిపోతుల ధనుంజయ గౌడ్ ,సిఐటియు మునుగోడు మండల కన్వీనర్ వరికుప్పల ముత్యాలు,మునుగోడు ఏఐటియుసి మండల అధ్యక్షులు దుబ్బ వెంకన్న, మునుగోడుఏఐటియుసి మండల కార్యదర్శిశివయ్య, , భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షులువీరయ్య, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులుఅన్నపూర్ణ,సత్తమ్మ,కే దారి,రమణమ్మ,డి రమణ, సిహెచ్ లక్ష్మి, పారిజాత, రాధిక, ప్రమీల,రాజేశ్వరి, కలమ్మ, తారకమ్మ,నాగమణి,,రమణ,,,తదితరులు పాల్గొన్నారు.