మరల బిఆర్ఎస్ దే విజయం

మందమర్రి, నేటిధాత్రి:-

జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో, నియోజకవర్గంలో మరల బిఆర్ఎస్ పార్టీ దే విజయం తథ్యమని బిఆర్ఎస్ పార్టీ 3వ వార్డు అధ్యక్షుడు రామ్ శేఖర్ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డ్ ఫిల్టర్ బెడ్ ఏరియాలో వార్డ్ అధ్యక్షుడు రామ్ శేఖర్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే బాల్క సుమన్ గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డుకు విచ్చేసిన ప్రచార రథం ఆలపించిన గేయాలు ఓటర్లను విశేషంగా ఆకర్షించాయి. అనంతరం ప్రతి ఇంటికి బిఆర్ఎస్ మేనిఫెస్టో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వివరిస్తూ, అభివృద్ధి యజ్ఞం కొనసాగేలా బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి, ఎమ్మెల్యే గా బాల్క సుమన్ ను గెలిపించి, నియోజకవర్గంలో, రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా ఓటు వేసి గెలిపించాల్సిందిగా అభ్యర్థిస్తూ, కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు, ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!