Exam Materials Distributed to 10th Class Students
ఉత్తమ ఫలితాలు సాధించాలి.
#పరీక్ష సామాగ్రి పంపిణీ చేసిన బట్టు సాంబయ్య.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
ఈనెల 14వ తేదీన జరగబోయే పదవ తరగతి పరీక్ష రాసే విద్యార్థులకు శుక్రవారం మండల కేంద్రంలోని కస్తూరిబా పాఠశాల విద్యార్థినిలకు పరీక్ష కు సంబంధించిన ప్యాడు, పెన్నులను ఉచితంగా దళిత విద్యావంతుల వేదిక జిల్లా కార్యదర్శి బట్టు సాంబయ్య అందజేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో ఒక లక్ష్య సాధన ఏర్పాటు చేసుకొని ఆ దిశగా కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించి ఉద్యోగాలు సంపాదించే వరకు విశ్రమించకూడదు .అలాగే పదవ తరగతి పరీక్షలో ఫస్ట్ ర్యాంకు సాధించిన విద్యార్థులకు 5116, ద్వితీయ ర్యాంకుకు3116 రూపాయల బహుమతిగా అందజేయడం జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. విద్యార్థులందరూ పరీక్షలు ఉత్తమ ఫలితాలు సాధించి పాఠశాలకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రత్యేక అధికారి సునీత, ఎమ్మార్పీఎస్ నాయకుడు పనికిరత్నం, ఉపాధ్యాయ బృందం, సిబ్బంది, విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.
