డీన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన — ఆచార్య గాదే సమ్మయ్య

ఆచార్య గాదే సమ్మయ్య డీన్ ఫ్యాకల్టీగా పదవి బాధ్యతలు చేపట్టారు. ఈరోజు నుండి రెండు సంవత్సరాల కాలం పదవిలో కొనసాగనున్నారు. డీన్ గా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ను పటిష్ట పరచడంలో ముఖ్యపాత్రను పోషిస్తారు. ఆచార్య సమ్మయ్య బీ.ఫార్మసీ మరియు డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీని కాకతీయ యూనివర్సిటీలోని ఫార్మసీ కళాశాలలో పూర్తి చేశారు. మాస్టర్ ఆఫ్ ఫార్మసీ ని బనారస్ హిందూ యూనివర్సిటీ వారణాసిలో పూర్తి చేశారు. ఈయన పర్యవేక్షణలో 4 డాక్టరేట్ డిగ్రీ ప్రధానం చేయడం జరిగింది, 3 డాక్టరేట్ డిగ్రీ సమర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. మరో 4 గురు ప్రస్తుతము వారి యొక్క రీసెర్చ్ కొనసాగిస్తున్నారు. ఆచార్య సమ్మయ్య గారి ఆధ్వర్యంలో 73 ఆర్టికల్స్ నేషనల్ ఇంటర్నేషనల్ జర్నల్లో ప్రచురించడం జరిగినది. ఆచార్య సమ్మయ్య కు డిఎస్టి మరియు యూజీసీ యాంటీ క్యాన్సర్ మరియు ఆంటీ హెచ్ఐవి కొరకు కొత్త మాలిక్యులు తయారు చేయడం కొరకు నిధులు మంజూరు చేయడం జరిగినది. ఆచార్య గాదె సమ్మయ్య ఆధ్వర్యంలో ప్రస్తుతము 65 మంది మాస్టర్ ఆఫ్ ఫార్మసి కోర్సును పూర్తి చేశారు మరో 23 మంది ప్రస్తుతం వారి యొక్క పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ఆచార్య సమ్మయ్య గారి పరిశోధన లు ముఖ్యముగా యాంటీ బ్యాక్టీరియల్, ఆంటీ వైరల్, కోవిడ్-19, ఆంటీ డయాబెటిక్, యాంటీ క్యాన్సర్,ఆంటీ ఆక్సిడెంట్, అల్జిమర్ మరియు పార్కిన్సోనీ వంటి రోగాల పై మాలిక్యుల్ తయారు చేయడం కొరకు ప్రస్తుతము విస్తృత రీసెర్చ్ కొనసాగుతున్నది. ఆచార్య సమ్మయ్య గతంలో ప్రిన్సిపాల్ అండ్ హెడ్, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్ పర్సన్ గా హెల్త్ సెంటర్ మెంబర్ ఇంచార్జి గా మరియు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్టడీ సెంటర్ డైరెక్టర్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ గా కీలకమైన పదవి బాధ్యతలు చేపట్టారు. మెంబర్ ఇంచార్జ్ ఫర్ హెల్త్ సెంటర్ గా ఉన్నప్పుడు విద్యార్థులకు మెరుగైన వైద్య సదుపాయం అందించడం కొరకు తన వంతు బలమైన కృషి చేశారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్టడీస్ సెంటర్ డైరెక్టర్ గా ఉన్న కాలంలో అంబేద్కర్ గారి యొక్క విద్యా విధానంను మరియు బుద్ధుని యొక్క ప్రవచనములు మరియు నేషనల్ ఇంటర్నేషనల్ సెమినార్సు, వర్క్ షాప్స్, గెస్ట్ లెక్చర్స్,ఎన్నో నిర్వహించడం జరిగింది. కొత్తగా డీన్ గా పదవి బాధ్యతలు ప్రొఫెసర్ నరసింహ రెడ్డి గారి నుండి చేపట్టిన ఆచార్య సమ్మయ్య గారిని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ప్రసాద్, ప్రొఫెసర్ కృష్ణవేణి బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్ పర్సన్, డాక్టర్ స్వరూప, డాక్టర్ సాహిద, డాక్టర్ నాగరాజు మరియు ఆచార్య సుధీర్ కుమార్, ఆచార్య వెంకటేశ్వరరావు, చల్ల శ్రీనివాసరెడ్డి, ఆచార్య విజయకుమార్, డాక్టర్ ప్రియాంక, డాక్టర్ సునీత, డాక్టర్ సూర్యనారాయణ, డాక్టర్ భాగ్య డాక్టర్ సుజాత డాక్టర్ ఉషాకిరణ్, వై డాక్టర్ శశిధర్, రీసెర్చ్ స్కాలర్ అయినటువంటి శ్రీ రమ్య, స్వర్ణలత, మంజుల, సుష్మిత, మరియు మాస్టర్ ఆఫ్ ఫార్మసీ విద్యార్థిని విద్యార్థులు, బీఫార్మసీ విద్యార్థిని విద్యార్థులు, నాన్ టీచింగ్ ఉద్యోగులు పుష్పగుచ్చం లు మరియు శాలువ లాతో ఆచార్య సమ్మయ్య గారిని సత్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!