మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
జడ్చర్ల నియోజకవర్గం
రాజాపూర్ మండల కేంద్రానికి చెందిన సాయిరి లక్ష్మయ్య(55) అకస్మాత్తుగా మరణించారు.
మృతికి సంతాపం తెలిపిన బి, ఆర్, ఎస్, పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి.
అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయన్ని యువసేన సభ్యుల ద్వారా అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బి, ఆర్, ఎస్, పార్టీ మండల ఉపాధ్యక్షులు రాచమల్ల యాదగిరి, మాజీ ఏఎంసీ డైరెక్టర్ వనపర్తి దేవేందర్, అభిమన్యు యువసేన ఉపాధ్యక్షులు సున్నం శ్రీనివాస్, తోపు శ్రీను, అనిల్, వెంకటేష్ బి, ఆర్, ఎస్, నాయకులు, యువసేన సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.