రోహిత్-కోహ్లీకి అరుదైన గౌరవం.

Cricket Australia. Cricket Australia.

రోహిత్-కోహ్లీకి అరుదైన గౌరవం.. ఆస్ట్రేలియాను మెచ్చుకోవాల్సిందే!

 

నేటిధాత్రి

 

 

 

 

 

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం దక్కింది. ఈ ఇద్దరి విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా మంచి నిర్ణయం తీసుకుంది. మరి.. ఆ నిర్ణయం ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఆధునిక క్రికెట్‌పై చెరగని ముద్ర వేశారు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. ఆడిన ప్రతి దేశంలోనూ అదరగొట్టారీ స్టార్లు. టీ20, వన్డే, టెస్ట్ అనే తేడాల్లేకుండా బరిలోకి దిగితే చాలు.. పరుగుల వర్షం కురిపించడమే ధ్యేయంగా ఆడుతూ వచ్చారు. అయితే పొట్టి ప్రపంచ కప్-2024 తర్వాత టీ20లకు గుడ్‌బై చెప్పిన ఈ ద్వయం.. ఇటీవలే టెస్టులకూ రిటైర్‌మెంట్ ప్రకటించారు. ఇకపై వన్డేల్లో మాత్రమే కొనసాగుతామని వెల్లడించారు. దీంతో అభిమానులు తెగ బాధపడుతున్నారు. కనీసం ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడకుండా రిటైర్ అవడం ఏంటని ఫీల్ అవుతున్నారు. సత్కరించే అవకాశం కూడా ఇవ్వరా అని వాపోతున్నారు. ఈ తరుణంలో రోహిత్-కోహ్లీ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా చేస్తున్న పని తెలిసి ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. అసలు సీఏ ఏం చేసిందంటే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!