‘హాఫ్ ప్రైజ్’ స్కాంగా ప్రసిద్ధి
అన్ని పార్టీలకు చెందిన కొందరు నాయకుల మెడకు చుట్టుకుంటున్న వైనం
ఎా3గా మాజీ హైకోర్టు న్యాయమూర్తి
30వేల మంది బాధితులు
నిఘా నీడలో రాష్ట్రంలోని ప్రముఖులు
నేటిధాత్రి డెస్క్:
‘‘నన్ను మోసం చేశాడు’’ అని అనడం తప్పు. ఎందుకంటే నువ్వు మోసపోయే అవకాశం పక్కవాడికి ఇచ్చావు కనుక మోసంచేసాడు. అంటే లోపం నీదగ్గరే వుంది. అందువల్ల మోసపోయేవాడున్నప్పుడు మోసం చేసేవాడు ఎప్పుడూ వుంటాడు! మోసపోవడానికి ప్రధాన కారణం ‘ఆకర్షణ’. సహేతుకంగాలేని ‘ఆకర్షణ’కు లోబడటం మానవుల సహజ బలహీనత! దీన్నే మోసగాళ్లు సావ కాశంగా తీసుకుంటున్నారు. ఇటువంటి ప్రలోభపూరిత ‘ఆకర్షణలకు’ మహిళలే తేలిగ్గా ఎరగా మారుతుంటారు. ఇందుకు ఉదాహరణగా ప్రస్తుతం కేరళలో స్వచ్ఛంద సంస్థ ముసుగులో 26ఏళ్ల యువకుడు మొత్తం 14 జిల్లాలకు చెందిన ప్రజలను రూ.వెయ్యికోట్ల మేర మోసం చేసిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. విచిత్రమేమంటే అతనికి ప్రచారం విపరీతంగా వస్తున్న నేపథ్యంలో, అతనితో కలిసి ఫోటోలు దిగిన లేదా సన్నిహితంగా మెలిగిన రాజకీయ నాయకులల మెడకు కూడా ఇది చట్టుకోవడంతో కేరళను ఈ స్కాం కుదిపేస్తోంది. కేరళ హైకోర్టు మాజీ న్యాయమూర్తి సి.ఎన్. రామచంద్రన్ పేరు ఈ కేసులో మూడో నిందితుడిగా వుండటం మరో విచిత్రం! అయితే రాజకీయ నాయకులు, ఈ మాజీ న్యాయమూర్తి తమకు ఈ స్కాంతో ఎటువంటి సంబంధంలేదని చెబుతున్నారు. ఈ మొత్తం స్కాంకు మూలకారకుడు 26 సంవత్సరాల యువకుడు అనందు కృష్ణన్. మువ్వత్తుప్ఫూజ సామాజిక`ఆర్థిక అభివృద్ధి సొసైటీ పేరుతో ఇతను నడిపిన స్వచ్ఛంద సంస్థ (ఎన్జీఓ)కు సంబంధించిన 21 బ్యాంకు ఖాతాలను ఇప్పుడు కేరళ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రారంభంలో 34 కేసులు క్రైం బ్రాంచ్కు బదిలీ చేసినప్ప టికీ ఇవి 30వేలు దాటవచ్చని, బాధితుల సంఖ్య లక్షవరకు వుండవచ్చునని అంచనా వేస్తున్నారు. ఈ స్కాం విలువ రూ.వెయ్యికోట్లు దాటడంతో కేరళ స్టేట్ పోలీస్ చీఫ్ (ఎస్పీసీ) షేక్ దర్వేష్ సాహెబ్ కేసును క్రైమ్ బ్రాంచ్కి అప్పగించారు.
సగం ధరకే వస్తువులు
మొదట్లో సగం ధరకే స్కూటీలు, ల్యాప్టాప్లు, కుట్టుమిషన్లు అందజేస్తానని అనందు కృష్ణన్ విపరీతంగా ప్రచారం చేశాడు. ‘‘తనవద్ద కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ (సీఎస్ఆర్)లు వున్నాయని, మీరు సగం ధర చెల్లిస్తే, మిగిలిన సగం ధరను తనవద్ద ఉన్న సీఎస్ఆర్ నిధులనుంచి చెల్లిస్తానని నమ్మబలికాడు. దీనికి విపరీత ప్రచారం కల్పించడంతో జనాలు తాము కష్టపడి సంపాదించిన డబ్బును ఇతని చేతిలో పెట్టి చివరకు నిండా మునిగినట్టు తెలుసుకొని ఇప్పుడు లబోదిబో మంటున్నారు. ఇప్పుడు అనందు కృష్ణన్ స్కామ్ కేరళలోని ప్రధాన రాజకీయ ఫ్రంట్ల మెడకూ చుట్టుకుంది. అధికార సీపీఐ(ఎం) నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్, కాంగ్రెస్ నేతృత్వంలోని యుడీఎఫ్ మరియు బీజేపీలకు చెందిన పలువురు రాజకీయ నాయకులకు అనందు కృష్ణన్ నుంచి నిధులు అందాయని ఆరోపణలు రావడంతో ఇప్పుడు ఆయా పార్టీల్లో కలకలం రేగింది. ఇప్పుడు కృష్ణన్తో బహిరంగ కార్యక్రమాల్లో పాల్గన్న ఆయా పార్టీల నేతల గొంతులో పచ్చివెలక్కాయ పడ్డ చందంగా మారింది.
కాంగ్రెస్ ఎమ్మెల్యే వివరణ
కాంగ్రెస్ ఎమ్మెల్యే మ్యాథ్యూ కుజల్నందన్కు ఏకంగా రూ.7లక్షలు కృష్ణన్ నుంచి అందాయని మళయాలం టీవీ ఛానల్ సోమవారం కథనాన్ని ప్రసారం చేయడంతో అసెంబ్లీలో దుమారం రే గింది. దీంతో ఆయన టీవీ ఛానల్పై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని అసెంబ్లీలో ప్రకటించారు. ‘‘ఈ సంస్థలో కొంత మొత్తం డిపాజిట్ చేశామని, దీనికి సంబంధించి సంస్థ ఇచ్చిన హా మీ మేరకు తమకు వస్తువులు అందలేనది, నా సన్నిహితుడు తెలిపాడు. ఆయనతో పాటు మరి కొందరు కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారని నాకు చెప్పాడు’’, నాకు ఇంతవరకే తెలుసని ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే వివరణ ఇచ్చారు. ఇక కేరళలో సాయి ట్రస్ట్ ఛైర్మన్ కె.ఎన్. ఆనంద్కుమార్కు అనందు కృష్ణన్తో ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో ఇంటెలిజెన్స్ వర్గాలు ఆయనపై నిఘా పెట్టాయి. ఈయన కేరళలో చాలా పేరున్న సామాజికవేత్త! ‘‘నేనెక్కడికీ పారిపోలేదు. వచ్చిన నిధులన్నింటికీ సక్రమంగా లెక్కలున్నాయి. అన్నీ చట్టపరిధిలోనే జరిగాయి’’ అని ఆయన తెలిపారు. ఇక ఈకేసులో కేరళ హైకోర్టు మాజీ న్యాయమూర్తి సి.ఎన్. రామచంద్రన్ నాయర్ పేరుకూడా వుండటంతో, ‘‘కృష్ణన్ సంస్థకు తాను ప్యాట్రన్గా ఎప్పుడూ వ్యవహరించలేదని, ఒకప్పుడుసంస్థకు సలహాదారుగా వ్యవహరించినప్పటికీ, ఆ పోస్ట్కు ఎప్పుడో రాజీనామా చేశాను’’ అని చెప్పారు.
హాఫ్ ప్రైజ్ాస్కామ్
కేరళను కుదిపేసిన ఈ రూ.1000కోట్ల స్కామ్ను ఇప్పుడు ‘‘హాప్ ప్రైజ్ాస్కామ్’’గా పిలుస్తున్నా రు. సగంధరకే వస్తువులు అందిస్తామని ప్రచారం చేయడంతో దీనికి ఈ పేరు స్థిరపడిపోయింది. స్కూటీలు, ల్యాప్టాప్లు, గృహోపకరణాలను సగం ధరకే ఇస్తామని, మిగిలిన సగం మొత్తా న్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ (సీఎస్ఆర్)నుంచి చెల్లిస్తామని ప్రచారం చేయడంతో ప్రజలు నమ్మారు. ప్రజలను నమ్మించడానికి కృష్ణన్ రాష్ట్రంలోని ఇతర ఎన్.జి.ఒ.ల పలుకుబడినికూడా చక్కగా ఉపయోగించుకోవడం, ప్రజల్లో విశ్వసనీయత రావడానికి ప్రధాన కారణం. అసలు సీఎస్ఆర్ నిధులు లేనేలేవని విచారణాధికార్లు స్పష్టం చేశారు.
ఎవరీ అనందు కృష్ణన్
అనందు కృష్ణన్ ఇడుక్కి జిల్లా తొడుప్పుజాకు చెందినవాడు. ప్రస్తుతం అతనిపై అనేక కేసులు నమోదు కావడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణన్కు గతంలో మోసపూరిత చరిత్ర వున్నదని, ఇప్పుడు దాదాపు 30వేల మంది బాధితులనుంచి డబ్బును సేకరించేందుకు రెండు డజన్లకు పై గా బ్యాంకు ఖాతాలు ఉపయోగించినట్టు విచారణాధికార్లు నిర్ధారించారు. మీడియా కథనాల ప్ర కారం ఇడుక్కిలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన అనందు కృష్ణన్, తన స్థానిక పరిచయాల నేపథ్యం లో కొన్ని స్వచ్ఛంద సంస్థలను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఒక పంచాయతీ సభ్యుడు చెప్పిన ప్రకారం కృష్ణన్ తన స్వచ్ఛంద సంస్థలకు సర్దార్ పటేల్, అబ్దుల్ కలాం వంటి ప్రముఖుల పేర్లు పెట్టేవాడు. ఇతని తండ్రి కార్పెంటర్. తల్లి రాష్ట్ర పౌరసరఫరా విభాగంలో పనిచేస్తున్నారు. ఎన్.జి.ఒ.ను ప్రారంభించిన తర్వాత కృష్ణన్ జీవనశైలి ఒక్కసారిగా మారిపోయింది. లగ్జరీ కార్లు, ఆ స్తులు కొనుగోలు చేశాడు. ఒక్క డిసెంబర్ నెలలోనే అనందు కృష్ణన్ ఢల్లీి ప్రయాణాలకు రూ.338,000, అక్కడ విలాసవంతమైన హోటళ్లలో బసకు రూ.366,000 ఖర్చు చేసినట్టు విచారణ అధికార్లు వెల్లడిరచారు. కృష్ణన్, అతని సంస్థలకు సంబంధించిన 21 బ్యాంకు ఖాతాలను అధికార్లు గుర్తించారు.
తన గ్రామంలోని వారికి స్కూటీలు, ల్యాప్టాప్లు అందజేశాడు. ఆవిధంగా ఒకపక్క పెరుగుతున్న సంపదతో పాటు ఫిర్యాదులు కూడా పెరగడం మొదలైంది. కృష్ణన్ స్కీమ్ ప్రాథమికంగా ‘సీడ్ సొసైటీలు’, ‘కన్సల్టెన్సీల’ ద్వారా జరిగింది. మొదట్లో కొత్త అప్లికేషన్ల ద్వారా వచ్చిన మొత్తంతో ఏకమొత్తంగా స్కూటీలు, గృహోపకరణాలు, ల్యాప్టాప్లు కొనుగోలు చేశాడని, ఈ కొనుగోళ్లకు అతనికి కమిషన్ కూడా ముట్టిందని పోలీసులు తెలిపారు.
నేషనల్ ఎన్జీఓస్ ఫెడరేషన్కు తాను కొఆర్డినేటర్గా కొనసాగడం కూడా ప్రజల్లో అతనిపట్ల వి శ్వాసం పెరగడానికి మరో కారణం. ఈ హోదాలోనే సీఎస్ఆర్ ఫండ్స్ తనకు వస్తాయని ప్రజలకు నమ్మబలికాడు. అందుకనుగుణంగా తొలినాళ్లలో అందరికీ వారికి కావలసిన ఉత్పత్తులను సరఫరా చేసి స్కీమ్ పట్ల నమ్మకాన్ని కలిగించాడు. క్రమంగా కృష్ణన్ ప్రజలకు ఉత్పత్తులను అందించలేకపోవడంతో, ఫిర్యాదుల సంఖ్య పెరుగుతూ పోయింది. ఇదిలావుండగా స్థానిక రాజకీయ నాయకులతో ఇతనికున్న సంబంధాలపై పోలీసులు ఆరాతీస్తున్నారు. కృష్ణన్ దెబ్బకు రాష్ట్రంలోని ప్రముఖ వ్యక్తులు, నేషనల్ ఎన్జీవో కాన్ఫిడరేషన్ సభ్యులు, రాజకీయనాయకులు ప్రస్తుతం పోలీసుల నిఘాలో వున్నారు. విచారణలో తాను రాజకీయ నాయకులకు డబ్బులు ఇచ్చానని కృష్ణన్ ఒప్పుకోవడంతో కేసు మరింత సంక్లిష్టంగా మారింది. ఇందులో సీఎస్ఆర్ ఫండ్స్ను వినియోగించామని చెప్పినప్పటికీ, వీరు చెబుతున్న కంపెనీలకు అసలీవిషయమే తెలియకపోవడం విశేషం. చివరకు అసలు సీఎస్ఆర్ నిధులనేవే లేవని పోలీసులు తేల్చారు.