Tribute to Bhagat Singh Martyrs
మాదారంలో విప్లవ వీరులు భగత్ సింగ్ కు ఘన నివాళి. కొవ్వొత్తుల ప్రదర్శన.
భగత్ సింగ్ స్ఫూర్తితో యువత పోరాటాల్లోకి రావాలి.
ఎన్ వి రాకేష్ పి వై ఎల్ రాష్ట్ర అధ్యక్షులు.
కారేపల్లి నేటిధాత్రి
భారత స్వాతంత్ర్య సంగ్రామ విప్లవ కెరటాలు భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ ల 95వ వర్ధంతిని పురస్కరించుకొని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాసంఘాలు పి వై ఎల్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి సింగరేణి మండలం మాదారం గ్రామంలో కొవ్వొత్తులతో భగత్ సింగ్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా పి.వై.ఎల్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.వి. రాకేష్ ఏఐయూకేఎస్ డివిజన్ కార్యదర్శి గుగులోతు తేజ నాయక్ అరుణోదయ జిల్లా నాయకులు వేములపల్లి వీరన్న లు మాట్లాడుతూ.
దేశ విముక్తి కోసం అతి చిన్న వయసులోనే ఉరికొయ్యను ముద్దాడిన భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ల త్యాగాలు అజరామరమని కొనియాడారు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా వారు సాగించిన పోరాటం నేటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. నేటి యువత వారి ఆశయాలను అందిపుచ్చుకొని ప్రజా సమస్యల పరిష్కారానికి విప్లవ స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. అమరవీరుల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని దోపిడీ లేని సమాజం కోసం పోరాడటమే వారికి మనం ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో పి.వై.ఎల్ నాయకులు కోయిల ఉమామహేష్ కుమ్మరికుంట్ల నరేష్ కల్తి లక్ష్మీనారాయణ తాటి కృష్ణ వేములపల్లి రమేష్ తిరుమలగిరి ప్రసాదు పూనం శ్రీను ఈసం రాంబాబు కోయిల వెంకన్న సేవగాని నవీన్ తదితరులు పాల్గొన్నారు.
