ఉప్పరపెల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన…,ఏఎంసీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య&
▪️రైతును రాజుగా చూడడం-వ్యవసాయాన్ని పండుగ చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.
▪️సీఎం రేవంత్ రెడ్డి రైతుబిడ్డగా రైతుల పక్షపాతి
▪️రైతులెవ్వరు అధైర్య పడవద్దు రైతు పండించిన ఆఖరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వమే కొంటుంది
▪️రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది
రైతులెవ్వరు దళారుల చేతిలో మోసపోవద్దు- కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
▪️రాష్ట్ర ప్రభుత్వం వరికి మద్దతు ధరతో పాటు 500/- బోనస్ ఇస్తుంది.
వర్దన్నపేట (నేటిధాత్రి):
ఏఎంసీ చైర్మన్ నరుకుడు, వెంకటయ్య,కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం వరంగల్ జిల్లా అధ్యక్షుడు బొంపెల్లి దేవేందర్ రావు, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షుడు అభిడి రాజ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు పోషాల వెంకన్నగౌడ్.ధాన్యం కొనుగోలు సెంటర్లలో రైతులకు ఇబ్బందులు కలుగకుండా త్వరితగతిన కాంటాలు అయ్యేలా చూస్తాం.వరంగల్ జిల్లా,వర్ధన్నపేట మండలం లో ను,ఉప్పరపెల్లి గ్రామంలో పి. ఎ. సి.ఎస్ వడ్లు కేంద్రం ను,ప్రారంభించిన వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం వరంగల్ జిల్లా అధ్యక్షుడు బొంపెల్లి దేవేందర్ రావు, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షుడు అభిడి రాజ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు పోషాల వెంకన్నగౌడ్ ,,ఈ కార్యక్రమములో డైరెక్టర్ మహేందర్ రావు, ఓ బి సి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నాంపెల్లి యాదగిరి, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు దామెర ప్రశాంత్, పోతాం మధుకర్,రాచమల్ల రాంమూర్తి,సినపెల్లి ఎల్లయ్య,షాగంటి యాకయ్య, తదితరులు పాల్గొన్నారు…
