పండుగకు చుక్క .ముక్క లేనట్లే !
◆-: మద్యం మాంసం విక్రయాలకు అనుమతి లేదు
◆-: ప్రభుత్వ ఖజానాపై తీవ్ర ప్రభావం
◆-: ఉమ్మడి మెదక్ జిల్లాలో రోజు రూ .10 కోట్ల వరకు మద్యం అమ్మకాలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
ముక్క ఉండాల్సిం దే. మద్యంతో పాటు మటన్ .చికెన్ కావాల్సిందే కానీ ఆ రోజు గాంధీ జయంతి ఉండడంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి. అదే రోజు దసరా పండుగ కూడా వస్తుంది ఈ నేపథ్యంలో మద్యం మాంసం వికలాలపై ఆసక్తికర చర్చ నడుస్తుంది. సాధారణంగా గాంధీ జయంతి రోజు మద్యం మాంసం దుకాణాలు మూసివేయడం ఆనవాయితీ అయితే అన్ని పండుగలా మాదిరిగా దసరా పండుగ ఉండదు ఆ రోజున చాలామందికి చుక్క లేనిదే ముద్ద దిగదు అందుకోసం పండుగ రోజు ఎట్లా అని మద్యం మాంసం. విక్రయాలపై ప్రజలు తర్జన బార్జన పడుతున్నారు.-: విక్రయాలపై సందిగ్ధం.దసరా పండుగ రోజు మాంసాహారులైన ప్రతి ఇంట్లో ముక్క ఉండాల్సిందే పండుగ వేళ గొర్రె పొట్టేలు.
మేక పోతుల మాంసానికి చాలా డిమాండ్ ఉంటుంది. నాటు కోళ్లు. ఫారం కోళ్లు. చేపలకు కూడా మస్తు గిరాకీ ఉంటుంది.ప్రతిరోజు కోట్లలో మద్యం విక్రయాలు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రతిరోజు రూ. 10 కోట్ల వరకు నెలకు సుమారు. 275 కోట్ల వరకు లిక్కర్ అమ్మకాలు జరుగుతాయి. అయితే ఒక్క దసరా రోజే ప్రతి ఏటా సుమారు రూ. 20 కోట్లకు పైగా అమ్మకాలు జరిగి భారీగా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. అయితే ఈసారి దసరా గాంధీ జయంతి ఒకే రోజు రావడం తో .మద్యందుకాణాలను మూసివేస్తున్నట్లు. ఎక్సెస్ శాఖ అధికారులు ప్రకటించారు దీంతో మద్యం అమ్మకాలపై రాష్ట్ర ఖజానాపై .తీవ్ర ప్రభావం పడే అవకాశం లేకపోలేదు.మటన్ షాపులకు అనుమతివ్వండి..
ప్రతి సంవత్సరం .దసరా రోజు మటన్ .చికెన్ షాపుల్లో. గిరాకీ ఉంటుంది .పండుగ రోజు విక్రయాలు జరగకపోతే ఆర్థికంగా. నష్టపోతాం .అధికారులు స్పందించి అనుమతులు ఇవ్వాలని. మాంసం దుకాణదారులు అంటున్నారు. పండుగా రోజు వివిధ గ్రామాల మండలాల నుండి .జహీరాబాద్ న్యాల్కల్ ఝరాసంగం మొగడంపల్లి కోహిర్ మండల కేంద్రానికి .వందలాది మంది మార్కెట్ కు మాంసం కోసం వస్తుంటారు. కావున ఆరోజు అనుమతి ఇవ్వాలని మాంసం విక్రయదారులు అంటున్నారు.
మద్యం విక్రయాలు జరగవు ఎక్సైజ్ శాఖ అధికారులు దసరా. గాంధీ జయంతి .ఒకేసారి రావడంతో. వైన్స్ .బార్ షాపులు. ప్రభుత్వ ఆదేశాల మేరకు .బంధు ఉంటాయని ఎక్సైజ్ శాఖ అధికారులు .తెలుపుతున్నారు. బెల్టు షాపుల నిర్వాహకులు విక్రయాలు జరిపితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అంటూ. ఎక్సైజ్ శాఖ అధికారులు అంటున్నారు. కావున గ్రామాల్లో ఉన్న బెల్టు షాపులపై దాడులు నిర్వహిస్తామని .ఎక్సైజ్ శాఖ అధికారులు అంటున్నారు..