తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, నేటిధాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావుతో సంబాషణ. తెలంగాణ అభివృద్ధిపై వివరణ కవిత మాటల్లోనే…
`గోసను బరిగీసి తరిమింది..
`కన్నీటి జాడ లేకుండా చేసింది..
`తెలంగాణ రైతుకు కష్టం దూరమైంది.
`వ్యవసాయం పండగయ్యింది.
`ప్రతి ఒక్కరి మోములో చిరునవ్వులు నింపింది.
`ఆసరాతో ఆదుకుంటోంది.
`ఆసుపత్రులతో పేదలకు వైద్యం అందుతోంది.
`తల్లుల సంక్షేమం చూస్తోంది..
`బిడ్డల బాగోగులు కంటోంది.
`కేవలం సిఎం. కేసిఆర్ నాయకత్వం వల్లనే సాధ్యమైంది.
`ప్రగతిలో తెలంగాణ ఫస్ట్.
`సంక్షేమంలో అన్ని రాష్ట్రాలకన్నా బెస్ట్.
`సాగు నీటి రంగంలో రువ్వడి.
`వ్యవసాయం వడివడి..
`భగీరథ ప్రయత్నం జరిగింది.
`తెలంగాణ నీటి గంగాళమైంది.
`మంచినీటి గోస తీరింది.
`ఫ్లోరైడ్ పీడ విరగడైంది.
`విద్యుత్ విప్లవం వచ్చింది…
`రైతుకు 24 గంటల కరంటు ఇస్తోంది.
`రెప్ప పాటు పోని కరంటు వస్తోంది.
`పంటల సింగారం…కోటి ఎకరాల మాగాణమైంది.
`రైతు బంధుతో ధీమా పెరిగింది.
`పెట్టుబడి లేదన్న భయం పోయింది.
`ఇలాంటి పథకం ఏ రాష్ట్రంలో వుంది?
`కళ్యాణ లక్ష్మి వస్తోంది…
` ఆడపిల్ల పెళ్ళి అవస్థ తప్పింది.
`ఐటికి తెలంగాణ కేరాఫ్ అయ్యింది.
`దేశమంతా తెలంగాణ వైపు చూస్తోంది.
`తెలంగాణ అభివృద్ధిని చూసి దేశం మురుస్తోంది.
`కేసిఆర్ నాయకత్వం మాకూ కావాలని కోరుకుంటోంది.
హైదరబాద్,నేటిధాత్రి: దార్శనికుడు ముఖ్యమంత్రి కేసిఆర్ చేతిలో ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తోంది. స్పూర్తి ప్రధాత కేసిఆర్ చేతిలో తెలంగాణ వికసిస్తోంది. ప్రగతి పరుగులు పెడుతోంది. అభివృద్ది ఉరకలేస్తోంది. ఉద్యమ కారుడి పాలనలో పల్లె మురిసిపోతంది. వ్యవస్ధ వికాసవంతమౌతోంది. తెలంగాణ అన్ని రంగాలలో ముందుడుగు వేస్తోంది. విజ్ఞానవంతమైన సమాజ నిర్మాణం సాగుతోంది. ప్రజలు కలలుగన్న తెలంగాణ కళ్లముందు సాక్ష్యాత్కారమైంది. తెలంగాణ సమాజాం ఆ ఫలాలు అందుకుంటోంది. ఉన్నతమైన ఆశయాల వెంట నడుస్తున్న తెలంగాణను చూసి భరత జాతి గర్వపడుతోంది. తెలంగాణ అభివృద్ధికి ఆలంబనగా నిలుస్తోంది. ప్రగతిని నలుదిశలా వ్యాపింపజేస్తోంది. తెలంగాణలో కేసిఆర్ పాలన స్వర్ణయుగాన్ని తెచ్చింది. తెలంగాణ వచ్చిందనే మాటే వెయ్యేనుగుల బలం నింపింది. తెలంగాణ తెచ్చిన కేసిఆర్ ధైర్యమే అభివృద్ధికి బాటలు వేస్తోంది. ముఖ్యమంత్రి కేసిఆర్ మదిలో నాటుకుపోయిన ఆలోచనలన్నీ కార్యరూపం దాల్చాయి. నిన్నటి తెలంగాణ, నేటి తెలంగాణ అన్న రెండు పదాల మధ్య గొప్ప చరిత్ర ఆవిష్కరణ జరిగింది. ఎక్కడా చూసినా అభివృద్ది తొనికసలాడుతోంది. పట్నం నుంచి పల్లెదాకా ప్రగతి పరుగులు పెడుతోంది. సాగు చేసుకునేందుకు భూమి వున్నా, ఉపాధి లేక, సాగు సాగక, భుక్తి కరువై, బతుకు బరువై పట్నం వలసలు వెళ్లిన తెలంగాణ పల్లెలు తెలంగాణ రాకతో మళ్లీ వికసించాయి. వలసజీవితంలో అవస్థలు పడ్డ ప్రజలు పల్లెలకు చేరి మురిసిపోతున్నారు. భూమిని నమ్ముకొని సాగు చేస్తున్నరు. తెలంగాణ తెచ్చిన కేసిఆర్ నీళ్లిస్తుంటే సాగుపండగ సాగిస్తున్నారు. పల్లెలు నీటి సవ్వడుల్లో సయ్యాటలాడుతున్నాయి. ఎండిన చెరువులు కొత్త శోభను సంతరించుకున్నాయి. నిండైన గంగాళాలయ్యాయి. ఎండాకాలంలో కూడా మత్తళ్లు దుంకుతున్నాయి. బీడు వారిన భూములు పొలాలై పులకరించిపోతున్నాయి. పంటలతో కళకళలాడుతున్నాయి. అంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, నేటిధాత్రి ఎడిటర్ కట్టారాఘవేంద్రరావుతో తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలను పురస్కరించుకొని చెప్పిన విషయాలు, వివరాలు కవిత మాటల్లోనే…నమ్మకమన్న పదం ఎంత బలమైందో, కేసిఆర్ పాలన అంత గొప్పదని చెప్పడానికి ఎలాంటి సందేహంలేదు.
తెలంగాణ కోసం పట్టిన పట్టు విడవకుండా, వెరవకుండా, పిడికిలి దించకుండా పోరాటం చేసిన నాయకుడు కేసిఆర్. తెలంగాణ ఏర్పాటుతోనే పీడిత ప్రజల కష్టాలు,కన్నీళ్లు తీరుతాయని బలంగా నమ్మిన నాయకుడు కేసిఆర్. తెలంగాణ సాధన కోసం, బలమైన ఆశయంతో, పట్టుదలతో తెలంగాణ సమాజాన్ని ఏకం చేసిన గొప్ప సంస్కర్త కేసిఆర్. తెలంగాణ పదాన్ని వేదం చేసి, ముందుండి నడిచిన నాయకుడు కేసిఆర్. తెలంగాణ సాధనతో సాధ్యమా అన్న పదాన్ని నిఘంటువులో లేకుండా చేసేలా తెలంగాణ సాధించిన ధీరుడు కేసిఆర్ . ఆయన చేతిలో తెలంగాణ మాగాణం బంగారమైపోయింది. పసిడి సిరులు పండుతున్నాయి. నీటి జాడలు లేక, నెర్రలు బారి తల్లడిల్లిన నేలతల్లిని నీటి ఆకలి తీర్చిన భగీరధుడు కేసిఆర్. పచ్చి జాడలేకుండాపోయిన, పొలాలు చూసి కుమిలిపోయిన రైతన్న కళ్లలో ఆనందభాష్పాలు రాలి ముత్యాలయ్యేంతగా మురిసిపోయే రోజు తెచ్చింది కేసిఆర్. తెలంగాణ సాగు సాగాలి. వ్యవసాయం పండగ కావాలి. రైతు రాజు కావాలన్నదే కేసిఆర్ కల. అసలు తెలంగాణ సాధనే రైతుకోసం. పచ్చని పల్లెకోసం. పాడిపంటలకోసం. మొత్తంగా నీటికోసం. ఆ నెరవేరిన స్వప్పం కన్నా రైతుకు ఆనందమేముంది. కేసిఆర్కు అంతకన్నా సంతోషమేముంది. తెలంగాణ ఎలా వస్తుంది అన్న వారు, తెలంగాణ వస్తే ఏమైతదన్నవారు కూడా తెలంగాణ చూసి అబ్బురపడుతున్నారు. ఆనందపడుతున్నారు. గర్వపడుతున్నారు. ఒకనాడు చిమ్మచీకట్లు కమ్మేసిన పల్లెలు చూసిన తెలంగాణ ప్రజలు పల్లె వెలుగులు చూసి మురిసిపోతున్నారంటే ఇంతకన్నా పండగమేముంటుంది.
ఒకటా రెండా, పద్నాలుగేళ్ల కాలం పాటు ఉద్యమం సాగంచిన యోధుడు కేసిఆర్. ఆ ఉద్యమకారుడు పాలకుడైతే పాలన ఎంత స్వర్ణమయమో, కాలం స్వర్ణయుగమో చరిత్రే మురిసేంత పండుగ రోజు. ఒకనాడు గోదారిలో పారే నీరు చూసి, మా పొలాల్లోకి రాకుండాపోతున్నాయే అని కళ్లనుంచి కన్నీరులొలుకుతుంటే, కడుపులో దు:ఖం తన్నుకుంటూ వస్తుంటే, పెదవులు అదిమి పట్టుకొని, నా తెలంగాణ పొలాలు ఈ నీటితో ఎప్పుడు తడుస్తాయో అని కలత చెందినది కేసిఆర్. ఆ కతలను చెరిపేసి, రైతు కలలు నిజం చేసి కేసిఆర్ తెలంగాణ పాలిట దేవుడయ్యాడు. అపర భగీరధుడయ్యాడు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ పల్లెలు పచ్చని పైటను కప్పుకొని, పొలాలై, వనాలై పోయాయి. నీరు లేక ఎవుసం సాగక, ఎండే పంటలు చూసిగుండెలు బాదుకోవడం కాన్న, పట్నం పోయి బతకడం మేలనుకొని, ఊళ్లు ఖాళీ చేసి, వలసలు పోయిన తెలంగాణ పల్లెలు మళ్లీ కళకళలాడుతున్నాయి. తెలంగాణ వస్తుందా? అన్న ప్రశ్నలు వినిపించిన నాటి నుంచి, తెలంగాణ వచ్చిందన్న సంతోషం నింపుకున్న తరుణం దాకా కాలానికి ఎదురీదిన యోధుడు కేసిఆర్…ప్రజల్లో చైతన్య రగిల్చిన చాణక్యుడు కేసిఆర్. ఎదురొచ్చిన వారిని రాజకీయంగా ఎదుర్కొన్న ధీరుడు…తెలంగాణ కల గన్నాడు. అందరినీ ఏకం చేశాడు. ముక్కోటి తెలంగాణ వాసుల చేత జై తలంగాణ అనిపించాడు. జనం నినదించేలా చేశాడు…ప్రతి ఒక్కరూ జై తెలంగాణ నానాదం నామస్మరణ చేసేలా చేశాడు. తెలంగాణ జాతి కోసం..తెలంగాణ జాగృతి కోసం, తెలంగాణ వెలుగు కోసం, పీడిత పాలనుంచి విముక్తి కోసం బరిగీసి నిలిచాడు. సకల జనులను తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు చేశాడు. సబ్బండ వర్గాల ఐక్యతా రాగంతో జై తెలంగాణ నినాదం దిక్కులు పిక్కటిల్లేలా నినదించేలా చేశాడు. ఒక్కడుగా మొదలై, కోట్లాది మంది గొంతుకలయ్యాడు…లక్షలాది మంది పోరాట యోధులను తయారు చేశాడు…ఉద్యమ ఆకాంక్ష నింపాడు. తెలంగాణ ఏర్పాటే శరణ్యమన్న భావన అందరిలో రగిలించాడు. తెలంగాణ ఉద్యమ చరిత్రకే నూతన అధ్యాయం లిఖించాడు. తన కీర్తిని శాశ్వతం చేసుకున్నాడు. తెలంగాణ విముక్తి కోసం ప్రాణాలను సైతం ఒడ్డేందుకు సిద్దపడ్డాడు. చావు నోట్లో తలపెట్టి, తెలంగాణ సాధించాడు. తెలంగాణ అన్నది సంధితో సాధ్యం కాకపోతే సమరమే అని ముందు నుంచే ప్రజలను సన్నద్దం చేశాడు. కడలి తరంగం అంతరంగమై అలలలాంటి తెలంగాణ ఆవేశాన్ని ఉద్యమంగా మలిచాడు. జనం గొంతుకలో కేసిఆర్ అనే నామస్మరణ కూడా జత చేశాడు…పిడికిలెత్తి తాను నినదిస్తూ, ప్రతి ఒక్కరి చేత తెలంగాణ జపం చేయించాడు. తెలంగాణ గుండె చప్పుడు ఉద్యమానికి తోడు చేశాడు. పల్లె ప్రజల ఊపిరిని తెలంగాణ ఉద్యమానికి ఆయువు చేశాడు. తెలంగాణ సాధనే లక్ష్యమై, ఉద్యమమై నిలిచి గెలిచిన సింహస్వప్నం కేసిఆర్.. తెలంగాణలో కష్టమన్న పదం రైతుకు దూరం చేసిన పెద్ద రైతు కేసిఆర్.
వ్యవసాయం పండుగయ్యింది. ప్రతి ఒక్కరి మోములో చిరునవ్వులు విరభూస్తున్నాయి. తెలంగాణలో ఆసరా ఎంతో భరోసా ఇస్తోంది. తెలంగాణ వచ్చిన తర్వాత పెరిగిన ప్రభుత్వ వైద్యం, ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిస్తోంది. తెలంగాణ పల్లెలో బస్తీ దవఖానాలు, జిల్లాల్లో వైద్య కళాశాలలు, వరంగల్ లాంటి నగరంలో 2వేల పడకల కొత్త ఆసుపత్రి, నిమ్స్ మరింత విస్తరణ, నగరం చుట్టూ నాలుగు పెద్ద ఆసుపత్రులు ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ వైద్యరంగంలో విప్లవం వచ్చింది. తల్లీ బిడ్డల సంక్షేమం తెలంగాణ ప్రభుత్వ ద్యేయం. ప్రగతిలో తెలంగాణ ఫస్టు,దేశంలోనే బెస్ట్ అని కొనియాడబడుతోంది. సంక్షేమంలో దేశంలో ఎక్కడా లేని పథకాలు అమలౌతున్నాయి. సాగునీరే కాదు, తాగు నీటి సమస్య లేకుండా పోయింది. ఫ్లోరైడ్ రక్కసి తరిమేయబడిరది. విద్యుత్ విప్లవం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలంగాణ రైతు కన్నీటి నుంచి చూసిన కరెంటు, అదే తెలంగాణ రైతు చిరునవ్వును చూసేంత వెలుగునిస్తోంది. కోటి ఎకరాల మాగాణంతో దేశానికి తెలంగాణ అన్నం పెడుతోంది. రైతు బంధు వచ్చింది. రైతుకు ధీమా పెంచింది. భీమా కూడా కల్పించబడిరది. ఆ కుటంబాన్ని ఆదుకునేందుకు మార్గం వేయడిరది. పెట్టుబడి లేదన్న భయం లేకుండపోయింది. ఇలాంటి ఫథకాలు ఎక్కడైనా వున్నాయా? కళ్యాణ లక్ష్మి ప్రతి ఇంటిలో ఆడపిల్ల పెళ్లి భారాన్ని దించింది. ఐటి రంగానికి తెలంగాణ కేఆరాఫ్ అడ్రస్ అయ్యింది. దేశమంతా తెలంగాణ వైపు చూస్తోంది. తెలంగాణ అభివృద్ధిని చూసి దేశమే మురిసిపోతోంది. కేసిఆర్ నాయకత్వం మాకూ కావాలని దేశమే కోరుకుంటోంది. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా ప్రజలకు అభినందనలు,శుభాకాంక్షలు.