
సామాజిక ఆసుపత్రిని తనిఖీ చేసిన – జాతీయ నోడల్ అధికారి
మహాదేవపూర్ ఆగస్టు 21 (నేటి ధాత్రి)
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలోని సామాజిక ఆసుపత్రిని గురువారం రోజున జాతీయ నోడల్ అధికారి రమణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనే జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధిక వర్షపాతం నమోదు కావడం ఎడతెరిపి లేకుండా వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆసుపత్రులలో ఒక్కసారిగా రోగుల సంఖ్య గణనీయంగా పెరగడంతో మారుమూల ప్రాంతమైన మహాదేవపూర్ సామాజిక ఆసుపత్రిని జాతీయ నోడల్ అధికారి రమణ అకస్మికంగా తనిఖీలలో భాగంగా రోగుల వివరాలను, సంబంధిత రిజిస్టర్లను, ఎమర్జెన్సీ వార్డులను, డయాలసిస్ సెంటర్లను, డాక్టర్లు అందించే సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఎన్ఓ రమణ, డిఎన్ఓ ఉమాదేవి, డిపిఓ చిరంజీవి, డిఎల్వో ప్రమోద్ కుమార్, పిఓఎన్సిడి సందీప్ కుమార్, సూపర్డెంట్ విద్యావతి, పలువురు డాక్టర్లు, ఆస్పత్రి సిబ్బంది, రోగులు పాల్గొన్నారు.