
Government Maternity Hospital,
వెల్నెస్ సెంటర్ ను తనిఖీ చేసిన డిఎంహెచ్వో అప్పయ్య
హన్మకొండ, నేటిధాత్రి(మెడికల్):
హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి దవాఖాన ఆవరణలో ఉన్న (ఈ జే ఎచ్ ఎస్) ఉద్యోగులు, జర్నలిస్టులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండావెల్నెస్ సెంటర్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని, అలాగే మందుల కొరత లేకుండా ఎప్పటికప్పుడు స్టాక్ పరిశీలిస్తూ ఇండెంట్ చేయాలని అనుమకొండ డిఎంహెచ్ఓ డాక్టర్ ఏ అప్పయ్య సూచించారు. ఈరోజు ఆయన హనుమకొండ జిల్లా ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ నిఖిల్ తో కలిసి తనిఖీ చేశారు. ఏ మందులు అందుబాటులో ఉన్నాయి ,మందుల నిల్వ ఎలా ఉంది అలాగే రికార్డులను పరిశీలించారు. అలాగే ఓపిలో వైద్య సేవల తీరును ల్యాబ్ మరియు ఇతర విభాగాలను ఆయన పరిశీలించారు. మందులతో పాటు ఏ సమస్యలు ఉన్నా ముందుగానే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. చికిత్స నిమిత్తం వచ్చినవారికి ఓపికతో, మర్యాదతో వ్యవహరించి తగిన చికిత్స అందించాలన్నారు. ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ నిఖిల్
డాక్టర్ చరణ్, డాక్టర్ సుస్మిత డాక్టర్ చైతన్య, డెమో వి అశోక్ రెడ్డి, శ్రవణ్ సురేష్ పాల్గొన్నారు.