
Zaheerabad Area Hospital
చెత్తడబ్బాలో శిశువు మృతదేహం
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి: జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలోని క్యాంటీన్ ముందు చెత్తడబ్బాలో శిశువు మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది. రెండు రోజుల క్రితం పుట్టిన మగ శిశువును శుక్రవారం రాత్రి ఇద్దరు మహిళలు చెత్త డబ్బాలో పడేసిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. శిశువు చనిపోయిన తర్వాత పడేశారా లేక బ్రతికుండగానే వదిలించుకున్నారా అనే కోణంలో జహీరాబాద్ పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.