కార్మికులారా ఏకం కండి! సినీ గద్దల మాయలో పడకండి!!

 

`‘‘రోహౌస్‌’’లు ముందు టెంట్లు వేయండి!

`రెచ్చగొట్టి పబ్బం గడిపేవారితో అప్రమత్తంగా వుండండి.

??’’రోహౌస్‌’’ లలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని మరొక ‘‘రోహౌస్‌’’ ఓనరే చిత్రపురి సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌, మునిసిపల్‌ కమిషనర్‌ కి పీర్యాదు చేసిన ఇప్పటివరకు చర్యలు లేవు.??

??కార్మికులు ధర్నాలు చేయాల్సింది ఫిల్మ్‌ చాంబర్‌ ముందు కాదు.??

`14 ఎకరాలు దోచుకున్న గద్దల రో హౌస్‌ ముందు నిరసనలు చేపట్టండి.

`‘‘రోహౌస్‌’’ లు అక్రమమని నినదించండి.

`‘‘రోహౌస్‌’’ లు కూల్చేదాకా నిరవదిక నిరసనలు కొనసాగించండి.

`అవినీతి పెద్ద ఎత్తున జరిగింది ‘‘రోహౌస్‌’’ లలోనే అది గమనించండి.

`‘‘ట్విన్‌ టవర్స్‌’’ నిర్మాణానికి అడ్డుపడితే మొదటికే మోసం వస్తుంది.

??14 ఎకరాలలో అప్పార్టుమెంట్లు నిర్మాణం చేస్తే అందరికీ న్యాయం జరుగుతుంది.??

`కార్మికులను ఎగదోస్తున్న ‘‘రోహౌస్‌’’ పెద్దల కుట్రలు పసిగట్టండి.

`వారి కుటిల ఎత్తుగడలలో బలికాకండి.

??చిత్రపురి సొసైటీ లో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలకు ఏర్పాటుకు డిమాండ్‌ చేయండి.??

`ప్రతి కార్మికుడు పాలు పంచుకునేలా చూడండి.

`ముందు ‘‘రోహౌస్‌’’ ల మీద దృష్టి పెట్టండి.

`కళ్ల ముందు కనిపిస్తున్న ‘‘రోహౌస్‌’’ లు కనిపించకుండా కనికట్టు కడుతున్నారు.

`అక్రమంగా నిర్మాణం చేసుకున్న ‘‘రోహౌస్‌’’ ల మీద అంతస్తులు చేపడుతున్నారు.

`‘‘రోహౌస్‌’’ ల 14 ఎకరాలు కూడా కార్మికుల సొంతమే.

`ఆ స్థలం వదిలేసి, అవకాశవాదుల మాటలు విని మోసపోకండి.

`తప్పుడు సమాచారమిచ్చి రెచ్చగొట్టే వారి పంచన చేరకండి.

`నిజా నిజాలు తెలుసుకోకుండా ‘‘రో హౌస్‌’’ పెద్దల వలలో పడకండి.

`నిజాలు గమనించి చిత్రపురి మీ సొంతమని తెలుసుకోండి.

`కార్మికుల కోసం ‘‘నేటిధాత్రి’’ అలుపెరగని అక్షర పోరాటం సాగిస్తోంది.

`కార్మికులకు ‘‘నేటిధాత్రి’’ చెప్పే నిజాలు చేరకుండా చేస్తున్నారు.

`చిత్రపురి సొసైటీలో లేనిపోని చిచ్చులకు మీరు బాధ్యులు కాకండి.

`పెనం మీద నుంచి పొయ్యిలో పడకండి.

`సినీ గద్దల మాటలు విని ఇంకా మోసపోకండి.

`ఏ రాజకీయ పార్టీ మీకు న్యాయం చేయదు.

`చిత్రపురి పేరుతో రాజకీయంగా పబ్బం గడుపునే వారున్నారు.

`ఏ రాజకీయ పార్టీ అండ కార్మికులకు అవసరం లేదు.

`కార్మిక నాయకులుగా రాజకీయ పార్టీలను ముందు పెట్టకండి.

`పోరాటం మీది, ఆరాటం మీది.

`అంతిమంగా ఎంత కాలమైన చిత్రపురి మీది.

`సినీ గద్దలతో పాటు, రాజకీయ పార్టీలు దూరుతాయి.

`ఇప్పటికే మీ జివితాలు ఆగమయ్యాయి.

`కార్మికుల పేరు చెప్పి రాజకీయ పార్టీలు సమస్య పరిష్కారం కాకుండా సాగదీస్తున్నారు.

`చిత్రపురిలో సమస్యల సమరం రావణ కాష్టం చేయాలని చూస్తున్నారు.

`చలిమంటలు చేసి సినీ గద్దలు చలికాచుకుంటున్నాయి.

`కార్మికుల బతుకులను జీవిత కాలం నాశనం చేస్తున్నాయి.

 

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

 చిత్రపురి సొసైటీ ఏర్పాటైన కాలం నుంచి కార్మికులను మోసం చేయడం, వారి అమాయకత్వాలను అలుసుగా చేసుకుంటున్నారు. సినీ పెద్దలు సమయానుకూలంగా కార్మికులను పావులుగా వాడుకుంటున్నారు. సినీ కార్మికులు అంటే నిర్మాతలు, దర్శకులు, నటలు కాదు. సినిమాలలో ఎదగలేక, ఎదుగూబొదులేక, సరైన అవకాశాలు రాక చిన్న చిన్న వేషాలకు పరిమితైననటులు. మిగతా అన్ని రంగాలలో చిన్న ఆదాయంతో బతికే వాళ్ల కోసమే చిత్రపురి. అలాంటి చిత్రపురిలో పెద్దలెందుకు దూరినట్లు. కార్మికుల భూముల్లో ఎందుకు వాలినట్లు. వీలైతే సినిమా పేరుతో కోట్లు సంపాదించుకునే పెద్ద పెద్ద హీరోలు, దర్శకులు, నిర్మాతలు కూడా కార్మికుల భూముల్లో వాలడం అంటే పేదల కడుపు కొట్టడమే. ఎలాగూ సినిమా మీద పిచ్చితో వచ్చినవారిని వెట్టి చారికీ చేయించుకుంటున్నారు. వారి బలహీనతలను సొమ్ము చేసుకుంటున్నారు. వారి కష్టం దోచుకుంటున్నారు. ప్రభుత్వం కార్మికుల కోసం ఇచ్చిన భూములను కూడా ఆక్రమించుకోవడం అన్యాయం. దుర్మార్గం. ఇలా ఏళ్లు చిత్రపురి మీద బతుకుతున్న ఎంతో మంది మధ్య వర్తులు, దళారులు, కార్మికుల పొట్టగొడుతున్నవారున్నారు. చిత్రపురికి ఒక సొసైటీ ఏర్పాటు చేసింది పెద్దలకు ఆశ్రయం కల్పించమని కాదు. పేదలకు అన్యాయం జరగొద్దని..కాని చిత్రపురి సొసైటీ ఏం చేస్తోంది? గతంలో చేయాల్సిందంతా చేసిన వారు, తప్పుకున్నారు. తర్వాత వచ్చిన వారు కూడా పెద్దలకు కొమ్ముకాయడమే చూస్తున్నాము. అసలు చిత్రపురిలో రోహౌజ్‌లు నిర్మాణానికి సొసైటీ ఎందుకు ఒప్పుకున్నది. ఎలా ఒప్పుకున్నది. ఎవరి ప్రోధ్భలంతో ఒప్పుకున్నది. ఎవరి ఒత్తిళ్లు చిత్రపురి సొసైటీ మీద పనిచేసిందనేది కూడా కార్మికులకు తెలియాల్సిన అవసరం వుంది. ఎందుకంటే చిత్ర పురి అనేది కార్మికుల సొత్తు. కార్మికుల హక్కు. అంతే కాని సినీపెద్దల కోసం ఇచ్చింది కాదు. సినీ పెద్దలు వాలడానికి వీలులేదు. అయినా దూరిపోయారు. కార్మికుల భూములు లాక్కున్నారు. అదికారులను మభ్యపెట్టి రోహౌజ్‌లు నిర్మించుకున్నారు. ఈ విషయంలో కార్మికులను చైతన్యం చేసిన వారు లేదు. రోహౌజ్‌ల నిర్మాణం అనేది బైలాలోనే లేదు. ప్రభుత్వం ఇచ్చిన జీవో. 658లో అసలే లేదు. సినీ పెద్దల ప్రస్తావన ఒక్క ముక్క కూడా లేదు. వారు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేకుండానే ప్రభుత్వం అన్ని రకాల షరతులతో జీవో విడుదల చేసింది. ఆ జీవోను తిమ్మిని బమ్మిని చేసి, కార్మికులను మోసం చేసి 14 ఎకరాలు ఆక్రమించుకున్నారు. ఇప్పుడిప్పుడే కార్మికులకు అసలు నిజాలు తెలుస్తున్నాయి. నేటిధాత్రి దిన పత్రిక గత కొన్నేళ్లుగా చిత్రపురిలో జరిగిన, జరుగుతున్న అన్యాయాలపై అనేక కధనాలు రాసింది. రోహౌజ్‌ల గుట్టు రట్టు చేసింది. రోహౌజ్‌ల నిర్మాణం అక్రమం, అనైతికం, చట్టరిత్యా నేరమని తేల్చి చెప్పింది. అసలు రోహౌజ్‌లలో కూడా ఒక్కొ గద్దలకు ఒకటికి రెండు రోహౌజ్‌లున్నాయి. ఆ రోహౌజ్‌లు నిర్మాణం చేసుకున్నవారు ఇండియాలో కూడా లేనివారున్నారు. అమెరికా లాంటి దేశాలలో వున్నవారికి కూడా రో హౌజ్‌లు ఇచ్చారు. కార్మికుల స్ధలంలో ఇంతటి అన్యాయానికి ఎందుకు ఒడిగట్టారు? ఈ విషయాలన్నీ పూస గుచ్చినట్లు నేటిధాత్రి గత కొన్ని సంవత్సరాలుగా కార్మికులను నిద్రలేపుతూ వుంది. అయినా ఇప్పటికీ కార్మికులలో కొంత మందిని విడదీసి, సినీ గద్దలు మళ్లీ ఫిల్మ్‌ చాంబర్‌ ముందు ధర్నాలుచేయిస్తున్నారు. నిరసనలు వ్యక్తంచేసేలా ప్రోత్సహిస్తున్నారు. ట్విన్‌ టవర్స్‌లోనే కాదు, ఇతర అప్పార్టుమెంట్ల నిర్మాణంలో అవకతవలు, అవినీతి జరిగిందని కార్మికుల చేత ప్రశ్నింపజేస్తున్నారు. మంచిదే. కాని రోహౌజ్‌ల అమ్మకాలు,నిర్మాణాలపై కూడా నిరసలు తెలియజేయాల్సిన అవసరం వుంది. కార్మికులకు భూమిని కార్మికులకు అప్పగించాల్సిన అవసరం వుంది. ఆ రోహౌజ్‌లకు చెందిన 14 ఎకరాలు కార్మికులదే అన్న సత్యాన్ని తెలియజేయకుండా, కొంత మంది కార్మికులను ఇంతకాలం మభ్యపెడుతూ వచ్చారు. ఇంకా మభ్యపెడుతూనే వున్నారు. రోహౌజ్‌ల అమ్మకాల వల్ల వచ్చిన అదనపు ఆదాయాన్ని కార్మికుల కోసంనిర్మాణాలలో ఉపయోగించామని లేనిపోని లెక్కలు చెబుతున్నారు. 14 ఎకరాలలో కూడా పూర్తిగా కార్మికులకే ఇండ్ల నిర్మాణం చేపట్టి ఇస్తే ఎంతో మంది కొనుగోలు చేసుకునేవారు. కార్మికులందరికీ న్యాయం జరిగేది. ఆ పద్నాలుగు ఎకరాలను ఇతరులకు, సినీ రంగానికి సంబంధం లేనికి వారికి కట్టబెట్టడం నేరం కాదని ఎవరు చెప్పారు. అలా అమ్మకాలు జరపొచ్చని ఎవరు అనుమతులిచ్చారు. మున్సిపల్‌ శాఖనుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఎలా నిర్మాణాలుచేశారు. మున్సిపల్‌ నుంచి వున్న ఆదేశాలను ఎందుకు తుంగలో తొక్కారు. రోహౌజ్‌ల కోసం కేటాయించిన భూమిలో కూడా భూమి హక్కులు ఎవరికీ బదలాయించలేదు. కార్మికులు తెలుసుకోవాలి. రో హౌజ్‌లైనా సరే అప్పార్టుమెంటు తరహాలోనే నిర్మాణం చేయాలని నిబంధనలు,మున్సిపల్‌ ఆదేశాలు స్పష్టంగా వున్నాయి. అంతే కాని రోహౌజ్‌లు వ్యక్తిగతంగా అప్పగించాలిన ఎక్కడాచెప్పలేదు. ఆ భూములు కొనుగోలు చేసుకున్నామని చెప్పుకుంటున్నవారికి సొంతం అసలే కాదు. రోహౌజ్‌లు నిర్మాణం చేసుకున్న స్ధలంలో నాలుగైదు అంతస్దులు నిర్మాణం చేసుకున్నా, అది పైన అంతస్ధులు కూడా సొసైటీ నుంచి కొనుగోలు చేయాలి. కాని అందుకు విరుద్దంగా నిర్మాణాలు సాగుతున్నాయి. ఓ పక్క రో హౌజ్‌లు కూల్చివేసి, ఆ స్దలం కార్మికులకు అప్పగించాలని డిమాండ్లున్నాయి. ఈ విషయంలో ఇంకా కార్మికులను తప్పుతోవ పట్టిస్తున్నారు. రోహౌజ్‌లు నిర్మాణం చేసుకొని ఐదారేళ్లుగా నివాసాలు వుంటున్నారు. అంటూ కొత్త లెక్కలు చెబుతున్నారు. సినిమాకు సంబంధం లేని వారిని ఎవరు కొనుగోలు చేయమన్నారు? ఎందుకు కొనుగోలు చేశారు. హైడ్రా రంగంలోకి దిగిన తర్వాత ముప్పై,నలభై ఏళ్లుగానే కాదు, వంద సంవత్సరాల క్రితం నుంచి వుంటున్న వారిని కూడా ఖాళీ చేయిస్తున్నారు. మాకు తెలియకుండా అప్పుడు కొనుగోలు చేశామని చెబుతున్నప్పటికీ వినిపించుకోవడం లేదు. చట్టం గురించి తెలియక కొనుగోలుచేశామని చెబితే సరిపోదు. ఇక్కడ కూడ ఆంతే చిత్రపురిలో సినీ కార్మికులకు తప్ప మరొకరికి చోటు లేదు. ఐదారేళ్లుగా అక్కడ కోట్లు పెట్టి కొనుగోలు చేసి నివాసముంటున్నామంటే చట్టం ఒప్పుకోదు. అలా వాళ్లను మోసం చేసి, భూములు అమ్మిన వారిని నిలదీయండి. అంతే తప్ప కార్మికుల భూములను సొంతం చేసుకుంటామంటే కుదరదు. అందుకే కార్మికులారా! ఇప్పటికైనా ఏకం కండి. మాయమాటలు చెప్పేవారి మాటలు నమ్మకండి. చిత్రపురి సొసైటీలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏర్పాటుకు డిమాండ్‌ చేయండి. ఒక రోజు కాకపోతే వారం రోజులు సమావేశాలు ఏర్పాటుచేయమని కోరండి. మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు జరిగిన అవకతవకలపై చిత్రపురిసొసైటీని నిలదీయండి. ప్రతి ఒక్కరిని ప్రశ్నించండి. తప్పించుకోవాలని చూస్తే వదిలిపెట్టకండి. ఆ వెంటనే రోహౌజ్‌ల ముందు టెంట్లేసుకోండి. నిరసన ప్రదర్శనలు మొదలు పెట్టండి. కార్మికుల స్ధలాన్ని ఆక్రమించుకున్నవారు ఎందుకు ఖాళీ చేయరో చూడండి. తమ స్వప్రయోజనాల కోసం వాడుకునే వారిని నమ్మకండి. మీకు మీరుగా నాయకులు కండి. ఏ రాజకీయ పార్టీ వచ్చినా కార్మికులకు న్యాయం చేసింది లేదు. కార్మికుల పక్షాన పోరటం చేసినట్లు నటించి, రాజకీయ పార్టీలు సొసైటీకి తొత్తులుగా మారిపోయారు. వారు అనుకున్న లక్ష్యం నేరవేర్చుకుంటున్నారు. కార్మికులకు రాజకీయ పార్టీలు,నాయకులు కూడా అన్యాయం చేస్తున్నారు. ఇప్పటికీ మించిపోయింది లేదు. కార్మికులంతా ఏకతాటిపైకి రండి. రాజకీయ నాయకులను ఎంటర్‌ చేయండి. వారి మాటలు నమ్మకండి. ఎవరి మాట నమ్మకండి. నిజా నిజాలు తెలుసుకోండి. జరిగిన తప్పులను గుర్తించండి. మోసం చేసిన వారి లెక్కలు తీయండి. మోసం చేసిన పెద్దలను బజారు కీడ్చండి. సినీమా అవకాశాలు పోతాయని భయపడకండి. సినిమాల వల్ల ఇక సంపాదించేదేమీ వుండదు. కనీసం పోరాటం చేస్తే నీడనైనా దొరుకుతుంది. సినీ పెద్దల మాయపడితే సినిమాలుండవు. ఉండడానికి ఇల్లూ వుండదు. జీవిత కాలం అద్దెబతుకులు, అరువు జీవితాలే మిగులుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!