ప్రతి రోజు యోగా సాధనతో ఆరోగ్యం
కలెక్టరేట్ కార్యాలయ అధికారులతో యోగా శిక్షణ
ఐడీఓసీలో దశాబ్ది ఉత్సవాలు
యోగా శిక్షకులు శ్రీనివాస్, స్వప్న
సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):
సిరిసిల్ల పట్టణ కేంద్రంలో ని జిల్లా సమీకృత కార్యాలయంలో ప్రభుత్వ అధికారులకు, యోగ శిక్షణలో భాగంగా నిత్యం యోగా సాధనతో ఆరోగ్యంగా ఉంటారని ఆయుష్ యునాని డిస్పెన్సరీ యోగా శిక్షకులు బీ.శ్రీనివాస్,టీ.స్వప్న
పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగ దశాబ్ది ఉత్సవాలు కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం జిల్లా కలెక్టరేట్ అధికారులకు యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా యోగా ఆసనాలు, ప్రాణాయామం ముద్రలు ధ్యానము తదితర అంశాలపై వివరిస్తూ..చేయించారుప్రతి రోజు యోగా చేయడం వలన కలిగే లాభాలు, ఆరోగ్యం ఆనందం ఎలా పొందవచ్చు వంటి వివరాలు వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు , సిబ్బంది, కలెక్టరేట్ కార్యాలయ ఏవో.రామ్ రెడ్డి, ఆయుష్ జిల్లా నోడల్ అధికారి డాక్టర్ శశి ప్రభ, డాక్టర్ సౌమిని, డాక్టర్ శ్వేత, డాక్టర్ స్వరూప ,డాక్టర్ కళ్యాణి, డీపీఎం తిరుపతి ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.