నాణ్యమైన విత్తనాలు పురుగు మందులను సరఫరా చేయాలి.

Seeds Seeds

కల్తీ విత్తనాలను అరికట్టాలి…

నాణ్యమైన విత్తనాలు పురుగు మందులను సరఫరా చేయాలి…

నేటి ధాత్రి గార్ల:

కల్తీ విత్తనాలను అరికట్టాలని, బ్లాక్ మార్కెట్లో విత్తనాల విక్రయాలను నియంత్రించాలని సిపిఐ మండల కార్యదర్శి జంపాల వెంకన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శుక్రవారం నకిలీ విత్తనాలు,ఎరువులను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జంపాల వెంకన్న మాట్లాడుతూ, బ్లాక్ మార్కెట్ లో విత్తనాలను కొనుగోలు చేసిన రైతన్న ఆరుగాలం కష్టించి పంట సాగు చేస్తున్నప్పటికీ సరైన దిగుబడి రాక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కల్తీ విత్తనాల బెడద వ్యవసాయ ఉత్పత్తిని దెబ్బతీయటమే కాకుండా,అంతకుమించి రైతుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని అన్నారు. పంటల సాగులో మేలైన విత్తనాల ఎంపిక ఎంతో కీలకమని సరైన అవగాహన లేకపోవడంతో రైతన్నలు నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి సరైన దిగుబడులు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను అరికట్టేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కట్టేబోయిన పిచ్చయ్య, చౌకాల బిక్షం, కట్టెబోయిన శ్రీను, మాగం లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!